Latest News
బాలీవుడ్లో వివక్ష.. రెజీనా కసాండ్రా ఆవేదన..
దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రెజీనా కసాండ్రా తాజాగా బాలీవుడ్లో ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై బహిరంగంగా మాట్లాడారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ, హిందీ చిత్రసీమలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని ఆమె వెల్లడించారు.
నేషనల్ షుగర్ ఇనిస్టిట్యూట్లో ఉద్యోగాలు.. 4 టెక్నికల్ పోస్టుల భర్తీ
కాన్పూర్లోని నేషనల్ షుగర్ ఇనిస్టిట్యూట్ (NSI) 2026 సంవత్సరానికి గాను కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు సాంకేతిక (టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రెండో పెళ్లి ప్రచారంపై మీనా తీవ్ర అసహనం.. కూతురిని చూసైనా ఆపండి!
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా తన వ్యక్తిగత జీవితంపై కొనసాగుతున్న అవాస్తవ ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తన రెండో వివాహంపై సోషల్ మీడియాలో విస్తరిస్తున్న వదంతులు తనను తీవ్రంగా కలచివేశాయని ఆమె స్పష్టం చేశారు.
మార్చి 19న బాక్సాఫీస్ వార్.. రణ్వీర్ వర్సెస్ యశ్!
ఈ ఏడాది వేసవి ప్రారంభంలో రెండు భారీ ప్రాజెక్టు సినిమాలు పోటీ పడబోతున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2తోపాటు కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మూవీ కూడా ఒకే రోజున మార్చి 19, 2026న రిలీజ్ కానున్నాయి.
హిందూపురంలో బాలకృష్ణ సొంత ఇల్లు.. భూమి పూజ చేసిన నందమూరి దంపతులు..
హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు శుక్రవారం (ఫిబ్రవరి 20, 2026) తన సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హెచ్పీసీఎల్లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు!
ఇంధన రంగంలో స్థిరమైన, ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాన్ని ఆశించే వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2026 సంవత్సరానికి గాను భారీ నియామక ప్రక్రియను ప్రకటించింది.
ఏపీ అప్పుల్లో ఉన్నా.. మీకు విలాసాలా?: జగన్ నిప్పులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
రియల్మి పవర్ డేస్ సేల్ ప్రారంభం.. 5G స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు!
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి భారత్లో రియల్మి పవర్ డేస్ సేల్ పేరిట ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది. గురువారం (ఫిబ్రవరి 19, 2026) ప్రారంభం అయిన ఈ సేల్ ఫిబ్రవరి 22, 2026వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని రియల్మి తెలిపింది.
ప్రశాంత్ వర్మ పౌరాణిక చిత్రం నుంచి ప్రభాస్ అవుట్?
ఇటీవలి కాలంలో టాలీవుడ్లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు చర్చకు వస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. భారీ విజన్కు బదులుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, నటులు తప్పుకోవడం, ఆర్థిక భేదాభిప్రాయాలపై వార్తలు వినిపిస్తున్నాయి.

















