వినోదం
ఫిలింఫేర్ నిర్వాహకులపై నిహారిక అసహనం.. ఆ విషయంలో నిరాశ!
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ ఇండస్ట్రీల నుంచి నటీనటులు పాల్గొన్నారు.
అంజనాద్రి బెట్టలో ‘జై హనుమాన్’ ప్రారంభం.. షూటింగ్లో రిషబ్ శెట్టి!
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు జై హనుమాన్ అనే మూవీని సీక్వెల్గా ప్రకటించారు. కానీ ఆ మూవీని పట్టాలెక్కించడం ఆలస్యం అయింది.
‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం.. శంకర్ పల్లిలో కీలక షెడ్యూల్!
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న శంకర్పల్లిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో కల్కి 2 చిత్ర షూటింగ్ను మేకర్స్ ప్రారంభించారు.
బాలీవుడ్లో వివక్ష.. రెజీనా కసాండ్రా ఆవేదన..
దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రెజీనా కసాండ్రా తాజాగా బాలీవుడ్లో ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై బహిరంగంగా మాట్లాడారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ, హిందీ చిత్రసీమలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని ఆమె వెల్లడించారు.
రెండో పెళ్లి ప్రచారంపై మీనా తీవ్ర అసహనం.. కూతురిని చూసైనా ఆపండి!
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా తన వ్యక్తిగత జీవితంపై కొనసాగుతున్న అవాస్తవ ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తన రెండో వివాహంపై సోషల్ మీడియాలో విస్తరిస్తున్న వదంతులు తనను తీవ్రంగా కలచివేశాయని ఆమె స్పష్టం చేశారు.
మార్చి 19న బాక్సాఫీస్ వార్.. రణ్వీర్ వర్సెస్ యశ్!
ఈ ఏడాది వేసవి ప్రారంభంలో రెండు భారీ ప్రాజెక్టు సినిమాలు పోటీ పడబోతున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2తోపాటు కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మూవీ కూడా ఒకే రోజున మార్చి 19, 2026న రిలీజ్ కానున్నాయి.
ప్రశాంత్ వర్మ పౌరాణిక చిత్రం నుంచి ప్రభాస్ అవుట్?
ఇటీవలి కాలంలో టాలీవుడ్లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు చర్చకు వస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. భారీ విజన్కు బదులుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, నటులు తప్పుకోవడం, ఆర్థిక భేదాభిప్రాయాలపై వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రాణం నిలిస్తే చాలనుకున్నా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్!
బాహుబలి రెండు సినిమాలు తన కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచినప్పటికీ ఆ తరువాత వచ్చిన అనేక భారీ ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, అందుకనే బాహుబలి సక్సెస్ను తాను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయానని నటుడు దగ్గుబాటి రానా అన్నారు.
సురేఖ పుట్టినరోజు: భార్య గురించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ఈ పోస్ట్ సాధారణ పుట్టినరోజు సందేశం కాకుండా, 46 ఏళ్ల దాంపత్య బంధానికి అద్దం పట్టే భావోద్వేగ పోస్టుగా నిలిచింది.













