వినోదం
‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ మార్పు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బంపర్ న్యూస్. ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ను వారం రోజులు ముందుకు మార్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు.
దుబాయ్లో చిక్కుకుపోయారా? నేనున్నాను.. సోనూసూద్ మరో భారీ సాయం!
నటుడు సోనూసూద్ మరోమారు దాతృత్వం చాటుకున్నారు. కోవిడ్-19 సంక్షోభం సమయంలో, పంజాబ్ లో వరదలప్పుడు ఆయన ఎంతో మందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలోనూ గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
‘ప్లాన్ చేస్తే ఏదీ జరగదు’.. కెరీర్ కష్టాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్!
తనకు కమ్ఫర్ట్ జోన్లో ఉండడం అలవాటు లేదని, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటే వెళ్తానని, ప్లాన్ చేసినవి జరగడం లేదని, వదులుకున్న తరువాతే అవకాశాలు వచ్చాయని నటి రాశీ ఖన్నా తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
నిక్-ప్రియాంక హోలీ సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ త్రోబ్యాక్ ఫోటో!
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
యష్ ‘టాక్సిక్’ విడుదల వాయిదా.. జూన్కు వెళ్లిన గ్లోబల్ ప్రాజెక్ట్!
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల వాయిదా పడింది. ముందుగా మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్లో థియేటర్లలోకి రానుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలే ఈ వాయిదాకు ప్రధాన కారణమని చిత్రబృందం వెల్లడించింది.
‘రామాయణం’ రణబీర్ లుక్ లీక్.. ఆ విగ్పై నెటిజన్ల దారుణమైన ట్రోల్స్!
రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం నుంచి లీకైన ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్ ధరించిన విగ్పై ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు విజయ్ ఆల్ ది బెస్ట్.. విడాకుల పిటిషన్పై మాత్రం మౌనం!
విద్యార్థులంతా భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సూచించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో 12వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఆ పోస్టు పెట్టారు.
విజయ్-రష్మిక ఉదారత.. 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రకటన!
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా ప్రకటనతో ముందుకొచ్చారు. మార్చి 4న హైదరాబాద్లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్కు ముందు, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.
మేమంతా క్షేమం.. దుబాయ్లో శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల దుబాయ్లో తాను, తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని అభిమానులకు భరోసా ఇచ్చారు.

















