రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడానికి ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రంతో ఆయన సిద్ధమవుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ అంచనాల సీక్వెల్ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

March 16, 2026 3:49 PM
Ranveer Singh in an intense action pose from Dhurandhar 2.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘ధురంధర్ 2: ది రివెంజ్’. Photo Credit: Aditya Dhar/X.

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడానికి ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రంతో ఆయన సిద్ధమవుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ అంచనాల సీక్వెల్ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. అంతకు ముందు మార్చి 18న ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కొద్ది రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వచ్చిన స్పందనను చూస్తే ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మరో భారీ హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్‌నిల్క్‌ నివేదిక ప్రకారం, కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారా మాత్రమే ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ అమ్మకాల ద్వారా రూ.37.11 కోట్ల వసూళ్లు సాధించింద‌ని తేలింది. ఇక మొదటి రోజు (మార్చి 19) ప్రదర్శనల కోసం దేశవ్యాప్తంగా 10వేల‌కు పైగా షోలలో మొత్తం 6.1 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటివరకు రూ.22.70 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.

విదేశాల్లో రూ.60 కోట్లు..

కాగా విదేశాల్లో ప్రారంభ వీకెండ్ ప్రీ-సేల్స్ సుమారు రూ.60 కోట్లకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్యలను కలిపి చూస్తే ప్రీమియర్ ప్రదర్శనలు, మొదటి రోజు కలిపిన ప్రారంభ విండో మొత్తం రూ.119.81 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో బ్లాక్ సీట్ల బుకింగ్స్ కూడా ఉన్నాయి. ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం హిందీతో పాటు మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. మార్చి 7న ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 3 నిమిషాల‌ 25 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో రణవీర్ సింగ్ మరింత క్రూరమైన అవతారంలో కనిపించాడు. అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిట్ మరణం తర్వాత పాకిస్తాన్‌లోని లియారీ పట్టణాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటూ ప్రతీకారం కోసం సాగించే ప్రయాణాన్ని ఇందులో చూపించారు.

మొద‌టి భాగం ముగిసిన చోటు నుంచే క‌థ‌..

ఈ సీక్వెల్ మొదటి భాగం ముగిసిన చోట నుంచే కథ కొనసాగుతుంది. లియారీలో హమ్‌జా అలీ మజారి ఎదుగుదలను, మెజర్ ఇక్బాల్‌పై అతని నిర్దాక్షిణ్యమైన ప్రతీకార యాత్రను కథగా చూపిస్తుంది. ట్రైలర్‌లో ఉన్న శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కోపం, ప్రతీకారం, ఆగ్రహంతో నిండిన మరింత చీకటి స్వరూపంలో రణవీర్ సింగ్ తన పాత్రలో కనిపించడం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రణవీర్ సింగ్‌తో పాటు ఈ సీక్వెల్‌లో పలు ముఖ్య పాత్రలు కూడా తిరిగి కనిపించనున్నాయి. అర్జున్ రాంపాల్ మెజర్ ఇక్బాల్ పాత్రలో మళ్లీ నటిస్తుండగా, సంజయ్ దత్ ఎస్పీ చౌద‌రి అస్లాం పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆర్. మాధవన్ అజయ్ సన్యాల్ పాత్రలో, సారా అర్జున్ యాలినా జమాలి పాత్రలో, రాకేష్ బేడి జమీల్ జమాలి పాత్రలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment