Vijayashanthi : తెలంగాణలో బీజేపీ, తెరాస పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యాసంగి వరిధాన్యం కొనాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుండగా.. కేంద్రం మాత్రం బాయిల్డ్ రైస్ను కొనేది లేదని, సాధారణ రైస్ను కొంటామని తేల్చి చెప్పింది. దీంతో తెరాస నాయకులు 20వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీజేపీ నాయకులు రాష్ట్రంలో తిరగకుండా సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని రాములమ్మ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని “(K)కోతి (C)చేష్టల (R)రావు” గారి రాజ్యం తీరుగా చేసి గత్తర బిత్తర పరిపాలన నడిపిస్తున్నది మనందరం చూస్తూనే ఉన్నాము.”
“ఇక శ్రీరంగం కోవెల గజరాజు మొట్టికాయలు కొట్టినంకన్నా జర్రంత సక్కగైతదేమో అనుకుంటే… అట్లగాక రాష్ట్రానికి వచ్చిన వెంటనే బీజేపీని అడ్డుకోండ్రి…. ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను తిరగనియ్యకండ్రి అంటూ సీఎం స్థాయి కూడా మరచి “(K)కొండెంగె (C)చిందుల (R)రావు” గారి రాజ్యం లెక్క మరింత తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నరు.”
“ఇగ ప్రజల భయానికి జిల్లా పర్యటనలను మరోసారి కుంటి సాకులు చూపి, తప్పించుకుని ఎప్పటి లెక్కనే మోసపు మాటలు చెబ్తున్నరు. ఈ వింత, విపరీత, విచిత్ర విన్యాసాలన్నీ గమనిస్తున్న ప్రజలు సరైన సమయం కోసం హుజురాబాద్ తీరులో ఎదురు చూస్తున్నరు..” అంటూ విజయశాంతి కామెంట్ చేశారు. ఈ మేరకు ఆమె పోస్టు పెట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…