Pawan Kalyan : రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మళ్లీ రెండు స్థానాలనుండి పోటీ చేయనున్నారా.. అంటే.. అవుననే అంటున్నాయి పలు రాజకీయ వర్గాలు. ఆయన 2019 ఎలక్షన్లలో భీమవరం, గాజువాక ఇలా రెండు స్థానాల నుండి పోటీ చేయడం జరిగింది. కానీ రెండు చోట్లా ఓటమిని చవి చూశారు. ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలాగే రెండు నియోజక వర్గాలనుండి పోటీ చేసి ఒక స్థానంలో గెలుపొందారు.
అయితే రెండు స్థానాలనుండి పోటీ చేయడం అనేది ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ రెండు చోట్లా గెలిచినట్లయితే తమ నియోజక వర్గ పదవిని ఆ నాయకుడు వదిలి వేస్తాడని భావించే అవకాశం ఉండడం వలన రెండు స్థానాల్లో ప్రజలు ఓటు వేయకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అందు వలన రెండు చోట్లా ఓటమిని చూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తుంది.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇదే పద్దతిని మరొకసారి ఫాలో అవ్వనున్నారని తెలుస్తుంది. ఈసారి ఎన్నికలలో ఆయన ఉభయ గోదావరి జిల్లాల నుండి ఒక్కో నియోజక వర్గం చొప్పున రెండు స్థానాల నుండి పోటీ చేయనున్నారని సమాచారం అందుతుంది. ఈ రెండు జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తుంది. కొన్ని రాజకీయ వర్గాలు చెబుతున్న విధంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుండి అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట లేదా కాకినాడ నుండి పోటీ చేయనున్నట్టు విశ్వసిస్తున్నారు.
అయితే సదరు నియోజక వర్గాల్లో తెలుగు దేశం పార్టీ బలహీనంగా ఉండడంతోపాటు తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడం తనకు కలసి వస్తుందని పవన్ అభిప్రాయ పడుతున్నారని చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…