ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో విలాసవంతమైన కానుకతో తన తల్లి నిర్మల అల్లును సర్ప్రైజ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు కొత్త లెక్సస్ లగ్జరీ కారును బహుమతిగా అందజేశారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే నటుల్లో ఒకరైన అల్లు అర్జున్ తన సినిమాలతో పాటు కుటుంబానికి ఇచ్చే విలాసవంతమైన కానుకలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి ప్రాజెక్టుల ద్వారా భారీ పారితోషికం పొందుతున్న ఆయన మల్టీప్లెక్స్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కుటుంబానికి కూడా ఆయన అధిక ప్రాధాన్యతను ఇస్తూ వారికి ఖరీదైన వాహనాలను బహుమతిగా అందిస్తున్నారు.
ఇక తన తల్లి నిర్మలకు కారును గిఫ్ట్గా ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ తన తల్లితో కలిసి కార్ ముందు నిలబడి ఫోటోలు దిగారు. బహుమతిని స్వీకరిస్తున్న సమయంలో నిర్మల అల్లూ భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. అయితే అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం కచ్చితంగా సమయం కేటాయిస్తుంటారు. తన సినిమాల షూటింగ్లో కాస్త ఖాళీ దొరికినా కుటుంబ సభ్యులతో కలసి ఆయన విహార యాత్రలకు వెళ్తుంటారు. అలాగే సినిమా విడుదలయ్యాక కూడా ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్లు వేస్తుంటారు. ఆయన చివరి సారిగా పుష్ప 2 లో యాక్ట్ చేయగా వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది.
ఇక సినిమా రంగంలో అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ విజువల్ స్పెక్టకిల్ చిత్రంలో నటిస్తున్నారు. అదనంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రకటించారు. పుష్ఫ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిన ఆయన తన తదుపరి చిత్రాలతో కూడా సత్తా చాటుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొంండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్నారి సోషల్ మీడియాలో వారిని ఓ…
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…