Balakrishna : ఏపీలో సంచలనం రేపిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన వీడియో.. అధికార వైసీపీలో ప్రకంపనలు రేపింది. ఈ వీడియోపై విచారణ చేపట్టిన పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్ది కాదని ఎడిట్ చేసి ఉండవచ్చని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎంపీ మాధవ్ వీడియోపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ ఆయన మాట్లాడుతూ మాధవ్ ఘటనపై తొలిసారిగా స్పందించారు. మన ఎంపీ విచరక్షణా రహితంగా.. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి ఆయన సిగ్గులేకుండా జాతీయ వందనం చేయడానికి వచ్చాడు.
ఆయనను మన వాళ్లు (టీడీపీ నేతలు) అందరూ అడ్డుకున్నారు. ఎంతోమంది మీపై (కార్యకర్తలు) కేసులు పెట్టారు. వాళ్ల లాఠీల జులుం మీపై చూపించారు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదు. ప్రజలు అందరూ బయటకు రావాలి. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు. ప్రపంచ చరిత్ర తిరగరాసేందుకు ముందుకు రావాలి.. అంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఈలలతో హోరెత్తించారు. జై బాలయ్య.. జైజై బాలయ్య.. అంటూ నినాదాలు చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…