Actor Shivaji : టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన శివాజీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుడిగా చంద్రబాబు గెలుపుకోసం బాగానే కష్టపడ్డారు. ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ హాట్ టాపిక్ అయ్యారు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ మీటింగ్లో పాల్గొన్న హీరో శివాజీ వైసీపీపై పొలిటికల్ పంచ్లు వేశారు.
శివాజీ మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా.. నిజాయితీగా ఉన్న నాయకుడ్ని ఎన్నుకోండి. వెయ్యి, రెండువేలకు ఓట్లు అమ్ముకోవద్దు. నోటు, ఓటు, కోటర్కి పడిపోవద్దు.. పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకూడదని అంటారు.. అది అక్షరాలా నిజం. అందుకోసం ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మనకి అనవసరం. ప్రస్తుతకాలంలో కబ్జాలు, ఇసుక, మందు దందాలు నడుస్తున్నాయి. వీళ్లు ఏమనుకుంటున్నారంటే.. జనానికి డబ్బు పెట్టేశాను కదా.. ఓట్లు పడతాయిలే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో నుంచి బయటకురా.. జనంలోకి వచ్చి చూడు.. నీకు ఓట్లు వేయరు. నేను ఇప్పటికి 42 నియోజక వర్గాల్లో సర్వే చేయించాను. దీపావళి, సంక్రాంతి మధ్యలో నా సర్వే రిపోర్ట్ ఇస్తాను. నిజం చెప్పాలంటే.. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో వెయ్యి రెండు వేల ఓట్లతో బయటపడతారు అన్నాడు శివాజీ.
గోరంట్ల మాధవ్ ఏం చేశాడో సీఎంకు తెలుసు.. కానీ ఎందుకు ఊరుకుంటున్నారంటే.. ఈయన గురించి మాట్లాడితే అంబటి గురించి అవంతి గురించి మాట్లాడాలి, ఎందుకొచ్చిందిలే అని.. ఏమండీ గురువుగారూ మనోడిది ఏం లేదని చెప్పేయండని అన్నారు.. ఆయన చెప్పేశారు అంటూ సెటైర్లు వేశారు శివాజీ. ఆ వీడియో మాధవ్ది కాదంట.. నాదంట.. మరి నిజంగానే నాదేనేమో! జగన్ గారికి కూడా తెలుసు ఆ వీడియో ఎవరిదో. అందుకే వచ్చే ఎన్నికలకు మాధవ్కి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఆ వీడియో మాధవ్దే అని జగన్ గారికి తెలుసు.. కానీ చెప్పరు.. ఎందుకంటే అదే రాజకీయం ! వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని నటుడు శివాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…