Actor Shivaji : టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన శివాజీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుడిగా చంద్రబాబు గెలుపుకోసం బాగానే కష్టపడ్డారు. ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ హాట్ టాపిక్ అయ్యారు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ మీటింగ్లో పాల్గొన్న హీరో శివాజీ వైసీపీపై పొలిటికల్ పంచ్లు వేశారు.
శివాజీ మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా.. నిజాయితీగా ఉన్న నాయకుడ్ని ఎన్నుకోండి. వెయ్యి, రెండువేలకు ఓట్లు అమ్ముకోవద్దు. నోటు, ఓటు, కోటర్కి పడిపోవద్దు.. పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకూడదని అంటారు.. అది అక్షరాలా నిజం. అందుకోసం ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మనకి అనవసరం. ప్రస్తుతకాలంలో కబ్జాలు, ఇసుక, మందు దందాలు నడుస్తున్నాయి. వీళ్లు ఏమనుకుంటున్నారంటే.. జనానికి డబ్బు పెట్టేశాను కదా.. ఓట్లు పడతాయిలే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో నుంచి బయటకురా.. జనంలోకి వచ్చి చూడు.. నీకు ఓట్లు వేయరు. నేను ఇప్పటికి 42 నియోజక వర్గాల్లో సర్వే చేయించాను. దీపావళి, సంక్రాంతి మధ్యలో నా సర్వే రిపోర్ట్ ఇస్తాను. నిజం చెప్పాలంటే.. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో వెయ్యి రెండు వేల ఓట్లతో బయటపడతారు అన్నాడు శివాజీ.
గోరంట్ల మాధవ్ ఏం చేశాడో సీఎంకు తెలుసు.. కానీ ఎందుకు ఊరుకుంటున్నారంటే.. ఈయన గురించి మాట్లాడితే అంబటి గురించి అవంతి గురించి మాట్లాడాలి, ఎందుకొచ్చిందిలే అని.. ఏమండీ గురువుగారూ మనోడిది ఏం లేదని చెప్పేయండని అన్నారు.. ఆయన చెప్పేశారు అంటూ సెటైర్లు వేశారు శివాజీ. ఆ వీడియో మాధవ్ది కాదంట.. నాదంట.. మరి నిజంగానే నాదేనేమో! జగన్ గారికి కూడా తెలుసు ఆ వీడియో ఎవరిదో. అందుకే వచ్చే ఎన్నికలకు మాధవ్కి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఆ వీడియో మాధవ్దే అని జగన్ గారికి తెలుసు.. కానీ చెప్పరు.. ఎందుకంటే అదే రాజకీయం ! వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని నటుడు శివాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…