Actor Shivaji : టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన శివాజీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుడిగా చంద్రబాబు గెలుపుకోసం బాగానే కష్టపడ్డారు. ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ హాట్ టాపిక్ అయ్యారు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ మీటింగ్లో పాల్గొన్న హీరో శివాజీ వైసీపీపై పొలిటికల్ పంచ్లు వేశారు.
శివాజీ మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా.. నిజాయితీగా ఉన్న నాయకుడ్ని ఎన్నుకోండి. వెయ్యి, రెండువేలకు ఓట్లు అమ్ముకోవద్దు. నోటు, ఓటు, కోటర్కి పడిపోవద్దు.. పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకూడదని అంటారు.. అది అక్షరాలా నిజం. అందుకోసం ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మనకి అనవసరం. ప్రస్తుతకాలంలో కబ్జాలు, ఇసుక, మందు దందాలు నడుస్తున్నాయి. వీళ్లు ఏమనుకుంటున్నారంటే.. జనానికి డబ్బు పెట్టేశాను కదా.. ఓట్లు పడతాయిలే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో నుంచి బయటకురా.. జనంలోకి వచ్చి చూడు.. నీకు ఓట్లు వేయరు. నేను ఇప్పటికి 42 నియోజక వర్గాల్లో సర్వే చేయించాను. దీపావళి, సంక్రాంతి మధ్యలో నా సర్వే రిపోర్ట్ ఇస్తాను. నిజం చెప్పాలంటే.. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో వెయ్యి రెండు వేల ఓట్లతో బయటపడతారు అన్నాడు శివాజీ.
గోరంట్ల మాధవ్ ఏం చేశాడో సీఎంకు తెలుసు.. కానీ ఎందుకు ఊరుకుంటున్నారంటే.. ఈయన గురించి మాట్లాడితే అంబటి గురించి అవంతి గురించి మాట్లాడాలి, ఎందుకొచ్చిందిలే అని.. ఏమండీ గురువుగారూ మనోడిది ఏం లేదని చెప్పేయండని అన్నారు.. ఆయన చెప్పేశారు అంటూ సెటైర్లు వేశారు శివాజీ. ఆ వీడియో మాధవ్ది కాదంట.. నాదంట.. మరి నిజంగానే నాదేనేమో! జగన్ గారికి కూడా తెలుసు ఆ వీడియో ఎవరిదో. అందుకే వచ్చే ఎన్నికలకు మాధవ్కి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఆ వీడియో మాధవ్దే అని జగన్ గారికి తెలుసు.. కానీ చెప్పరు.. ఎందుకంటే అదే రాజకీయం ! వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని నటుడు శివాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…