Pushpa : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. క్రమ క్రమంగా ఈ మూవీకి ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ మూవీలో నటించిన వారితోపాటు పనిచేసిన వారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
పుష్ప మూవీ తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ క్రమంలోనే రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.116 కోట్ల గ్రాస్ను వసూలు చేయడం విశేషం. ఇక ఆదివారం కావడంతో 3వ రోజు కలెక్షన్లు బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక పుష్ప మూవీలో నటీనటుల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు, విలన్గా నటించిన మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ రూ.3.50 కోట్లు, దర్శకుడు సుకుమార్ రూ.25 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూ.3.50 కోట్లు, ఐటమ్ సాంగ్లో నటించిన సమంత రూ.1.50 కోట్లు తీసుకున్నారట. నెగెటివ్ రోల్లో నటించిన యాంకర్ అనసూయ ఒక రోజు షూటింగ్కు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల మేర తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…