Pushpa : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. క్రమ క్రమంగా ఈ మూవీకి ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ మూవీలో నటించిన వారితోపాటు పనిచేసిన వారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
పుష్ప మూవీ తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ క్రమంలోనే రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.116 కోట్ల గ్రాస్ను వసూలు చేయడం విశేషం. ఇక ఆదివారం కావడంతో 3వ రోజు కలెక్షన్లు బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక పుష్ప మూవీలో నటీనటుల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు, విలన్గా నటించిన మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ రూ.3.50 కోట్లు, దర్శకుడు సుకుమార్ రూ.25 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూ.3.50 కోట్లు, ఐటమ్ సాంగ్లో నటించిన సమంత రూ.1.50 కోట్లు తీసుకున్నారట. నెగెటివ్ రోల్లో నటించిన యాంకర్ అనసూయ ఒక రోజు షూటింగ్కు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల మేర తీసుకున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…