Bigg Boss 5 : గత 3 నెలలుగా ఎంతో ఉత్సాహంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కొనసాగింది. ఎట్టకేలకు ఈ షోకు ఆదివారంతో తెరపడింది. ఈ క్రమంలోనే ఈ సీజన్కు విన్నర్గా వీజే సన్నీ నిలిచాడు. ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ బిగ్బాస్ ఇంట్లోకి టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే అతను టాప్ 5 ఫైనలిస్ట్స్లో ఒకడిగా నిలిచాడు. తరువాత సీజన్ 5 విన్నర్ అయ్యాడు.
గ్రాండ్ ఫినాలెలో టాప్ 5 లో శ్రీరామ చంద్ర, సన్నీ, సిరి, షణ్ముఖ్, మానస్ నిలిచారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున ఫినాలె వారంలో మొత్తం 13 కోట్ల ఓట్లు పోలైనట్లు తెలిపారు. కాగా గత 4 సీజన్లలోనూ ఒక్క ఫీమేల్ విన్నర్ కూడా లేకపోవడం విశేషం. ఈ 5వ సీజన్లోనూ ప్రేక్షకులు మేల్ కంటెస్టెంట్నే విన్నర్ను చేశారు. వీజే సన్నీ ఈ సీజన్కు విజేతగా నిలిచాడు. ఇక షణ్ముఖ్ రన్నరప్గా నిలవగా, శ్రీరామ చంద్ర మూడో స్థానంలో నిలిచాడు.
బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం అయింది. సరయు, ఉమా దేవి, లహరి షెరి, శ్వేతా వర్మ, ప్రియా, ప్రియాంక సింగ్, నటరాజ్ మాస్టర్, హమీదా, విశ్వ, రవి, లోబో, అనీ మాస్టర్, జెస్సీ, ఆర్జే కాజల్, సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్రలతో ఈ సీజన్ను ప్రారంభించారు. చివరకు సన్నీ ఈ సీజన్కు విజేతగా నిలిచాడు.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలెకు పలువురు సెలబ్రిటీలు అతిథులుగా వచ్చారు. దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, హీరోలు నాగచైతన్య, నాని, హీరోయిన్లు కృతి శెట్టి, ఆలియా భట్లతోపాటు రణబీర్ కపూర్, సాయి పల్లవి, రష్మిక మందన్న, శ్రియలు ఈ గ్రాండ్ ఈవెంట్కు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…