Samantha : ఇటీవలి కాలంలో సమంత పేరు వార్తలలో ఎక్కువగా వినబడుతోంది. అందుకు కారణం.. పుష్ప మూవీలో ఆమె ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడమే అని చెప్పవచ్చు. ఈ సాంగ్పై అనేక వివాదాలు నెలకొన్నాయి. దీంతో సహజంగానే సమంత పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఈ సాంగ్ చేసినందుకు చాలా మంది ఆమెను విమర్శిస్తున్నారు. హీరోయిన్గా మంచి అవకాశాలే వస్తుండగా.. ఇలాంటి పాటలలో చేయడం అవసరమా ? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇటీవలి కాలంలో సమంత ప్రవర్తిస్తున్న తీరే ఎవరికీ అర్థం కావడం లేదు.
నాగచైతన్యతో విడాకులను తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత తాము ఎప్పటిలా స్నేహితుల్లా ఉంటామని చెప్పారు. అయితే వాస్తవానికి అలా జరగలేదు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదలైనప్పుడు, ఆ తరువాత మూవీ సక్సెస్ మీట్లో, అనంతరం చైతూ బర్త్ డేకు సమంత ఎలాంటి విషెస్ చెప్పలేదు. పోస్టులు పెట్టలేదు. దీంతో ఆమె చైతూ వల్ల బాగానే మనస్థాపానికి గురైనట్లు స్పష్టమైంది.
తాను సొంతంగా పెంచుకునే కుక్కకు బర్త్ డే చేసి దాని ఫొటోలను పోస్ట్ చేసింది సమంత. ఇక ఇటీవల రానా బర్త్ డేకు ఆమె శుభాకాంక్షలు చెప్పింది. అలాగే తాజాగా రానా భార్య మిహిక బర్త్ డేకు కూడా సమంత విషెస్ చెప్పింది. కానీ అక్కినేని ఫ్యామిలీ గురించి, చివరకు చైతూ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. వారి సినిమాలకు, ఈవెంట్లకు విషెస్ చెప్పడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె ప్రవర్తన ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.
ఈ మధ్య ఓ కార్యక్రమంలో డైవోర్స్పై సమంత స్పందించింది. తనకు ఈ ఏడాది అత్యంత చేదు సంవత్సరం అని చెప్పింది. ఇకపై ఎప్పుడు ప్రశ్నలు అడిగినా.. అందులో విడాకుల ప్రస్తావన తేవొద్దని జర్నలిస్టులను కోరింది. దీంతో ఆమె ఈ విషయంపై బాగానే డిస్టర్బ్ అయినట్లు స్పష్టమవుతోంది. అయితే భవిష్యత్తులోనైనా ఆమె అక్కినేని ఫ్యామిలీతో మాట్లాడుతుందా.. వారి గురించి పోస్టులు పెడుతుందా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…