స‌స్పెన్స్ వీడిపోయింది.. జ‌బ‌ర్ద‌స్త్ కొత్త యాంక‌ర్ ఎవ‌రో తెలిసిపోయింది..!

August 5, 2022 3:17 PM

గ‌త కొంత కాలంగా మ‌ల్లెమాల వారి జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ఎన్నో ఒడి దుడుకుల‌ను ఎదుర్కొంటోంది. స్టార్ క‌మెడియ‌న్లు దూరం కావ‌డంతో ఈ షోకు రేటింగ్స్ బాగానే ప‌డిపోయాయి. మ‌రోవైపు రోజా వెళ్లిపోవ‌డం, ఆ త‌రువాత మ‌రికొంద‌రు క‌మెడియ‌న్లు కూడా దూరం అవ‌డంతో.. షో కు ఆద‌ర‌ణ త‌గ్గిపోయింది. ఇక జ‌బ‌ర్ద‌స్త్‌కు యాంక‌ర్ అన‌సూయ కూడా గుడ్ బై చెప్పేసింది. ఆమెకు వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్‌కు డేట్స్‌ను అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోతున్నాన‌ని చెబుతూ క‌న్నీటి వీడ్కోలు తీసుకుంది. అయితే జ‌బ‌ర్ద‌స్త్‌లో అన‌సూయ త‌రువాత కొత్త‌గా ఎవ‌రు యాంక‌ర్‌గా వ‌స్తారోన‌ని ఇన్ని రోజుల పాటు స‌స్పెన్స్ నెల‌కొంది. కానీ ఎట్ట‌కేల‌కు సస్పెన్స్ వీడిపోయింది. కొత్త యాంక‌ర్ ఎవ‌రు అన్న‌ది బ‌య‌ట పెట్టేశారు.

జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ అనంత‌రం మంజూష యాంక‌ర్‌గా వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. ఈ మేర‌కు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి కూడా. అయితే అక‌స్మాత్తుగా ర‌ష్మి గౌత‌మ్‌నే మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌కు కూడా యాంక‌ర్‌గా తెచ్చారు. గ‌త వారం విడుద‌లైన ప్రోమోలో ప‌ల్ల‌కిలో కొత్త యాంక‌ర్‌ను మోసుకువచ్చారు. దీంతో ఆమె మంజూష‌నే అయి ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ కాదు. యాంక‌ర్ ర‌ష్మినే జ‌బ‌ర్ద‌స్త్‌కు కూడా యాంక‌ర్‌గా కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Rashmi Gautam is the new anchor for Jabardasth show

అయితే వాస్త‌వానికి గ‌తంలో అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయిన‌ప్పుడు కూడా కొంత కాలం పాటు ర‌ష్మినే రెండు కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా కొన‌సాగింది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌.. ఇలా రెండింటికీ ఆమెనే యాంక‌ర్‌గా చేసింది. ఆ త‌రువాత అన‌సూయ రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమెకు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లో యాంక‌ర్‌గా అవ‌కాశం ఇచ్చారు. దీంతో ర‌ష్మి ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కే పరిమితం అయింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ బాధ్య‌త‌ల‌ను తీసుకుంది. దీంతో ఆమె మ‌ళ్లీ రెండు షోల‌కూ యాంక‌ర్‌గా కొన‌సాగ‌నుంది.

ఇక మ‌ల్లెమాల వారు నిర్వ‌హిస్తున్న శ్రీ‌దేవి డ్రామా కంపెనీకి కూడా ర‌ష్మినే యాంక‌ర్‌గా ఉంది. దీంతో మొత్తంగా వారి భ‌విష్య‌త్తు అంతా ర‌ష్మి చేతుల్లోనే ఉంద‌న్న‌మాట‌. మ‌రి ఈ అమ్మ‌డు ఇప్పుడు ఈ మూడు కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ షోకు ఎలాంటి రేటింగ్స్ తెప్పిస్తుందో చూడాలి. చాలా మంది దూరం అయిన నేప‌థ్యంలో జ‌బ‌ర్ద‌స్త్ షోస్ ఇక‌పై ఎలా కొన‌సాగుతాయో కూడా చూడాలి. ఈ రిజ‌ల్ట్ రానున్న రోజుల్లో తేల‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now