బిగ్ బాస్ లో మోసం.. సామాన్యుడు ఎక్కడ అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..

September 6, 2022 11:58 AM

తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. భారీ అంచ‌నాల న‌డుమ సీజ‌న్ 6 తాజాగా మొద‌లైంది. ముందు నుంచే షో నిర్వాహ‌కులు సీజన్ 6 పై అంచ‌నాలు పెంచారు. ఇందులో సెల‌బ్రిటీలతోపాటు సామాన్యులు సైతం పాల్గొంటార‌ని ప్ర‌చారం చేశారు. కానీ తాజా ఎపిసోడ్ చూస్తే సామాన్యుల ఊసే లేదు. తాజాగా ప్ర‌క‌టించిన కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఒక్కరు కూడా సామాన్యుడు లేడు.

కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చ‌లాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు. యూట్యూబర్‌ ఆది రెడ్డిని కామనర్ అని ఇంట్రడ్యూస్ చేసాడు హోస్ట్ నాగార్జున. ఆ త‌ర్వాత అత‌ను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు.

netizen angry on bigg boss management

అంటే ఎంతో కొంత పాపులారిటీ ఉన్న వారిని హౌజ్‌లోకి పంపుతూ ఎంట‌ర్‌టైన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారే త‌ప్ప‌.. బిగ్ బాస్ సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. ఆడిషన్స్ చేసి ఇప్పుడు ఛీటింగ్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సామాన్యులకు బంపర్ ఆఫర్ అంటూ నాగార్జున అధికారికంగా మే నెలలో విడుదల చేసిన ప్రోమోను యూట్యూబ్ నుంచి తొలగించారు. దీన్ని బట్టి కావాలనే సామాన్యుడ్ని ఛీట్ చేశారని స్పష్ఠం అవుతోంది. ఎప్ప‌టి మాదిరిగానే ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లో వివిధ రంగాల‌కు చెందిన సెలబ్రెటీలు ఉన్నారు. దీనిపై స్టార్ మా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment