గురువారం, జూన్ 11, 2026
వినోదం

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!
అల్లు అర్జున్ పోస్ట్‌ను మెచ్చుకుంటూ నయనతార పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.
Nayanthara Instagram story about Allu Arjun and Chiranjeevi movie
అల్లు అర్జున్ పోస్ట్‌ను మెచ్చుకుంటూ నయనతార పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి నయనతార కూడా స్పందిస్తూ ఆయ‌న‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అల్లు అర్జున్ ఈ సినిమాపై పొడవాటి నోట్‌ను షేర్ చేస్తూ, Mana ShankaraVara Prasad Garu టీమ్ మొత్తానికి అభినందనలు. బాస్ తిరిగి వచ్చారు. మన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెండితెరపై మెరవడం చాలా ఆనందంగా ఉంది. ఫుల్ విన్టేజ్ వైబ్స్.. అంటూ ప్రశంసించారు. అలాగే వెంకటేష్ గురించి ప్రస్తావిస్తూ, వెంకీ మామ షోని దుమ్మురేపారు.. అని పేర్కొన్నారు. నయనతార నటనను కూడా మెచ్చుకుంటూ, నయనతార గ్రేస్‌ఫుల్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.. అని రాశారు. చివరగా ఈ సినిమాను సంక్రాంతి బాస్ బ్లాక్‌బస్టర్ గా అభివర్ణించారు.

థాంక్యూ బ‌న్నీ అని పోస్ట్ చేసిన న‌య‌న‌తార‌..

అల్లు అర్జున్ చేసిన ఈ ప్రశంసలకు నయనతార ఎంతో సరళంగా స్పందించారు. ఆయన పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ, థ్యాంక్యూ బన్నీ, స్వీట్ ఆఫ్ యూ.. అని రాసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ఏడో రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

అల‌రించిన చిరంజీవి – వెంక‌టేష్ కాంబో..

ఈ సినిమాలో నయనతార సంపన్న వ్యాపారవేత్త కుమార్తె శశిరేఖ పాత్రలో నటించగా, చిరంజీవి ఎన్‌ఐఏ అధికారి శంకరవరప్రసాద్ పాత్రలో కనిపించారు. ప్రత్యేక ఆకర్షణగా దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించగా, చిరంజీవి – వెంకటేష్ తొలిసారిగా కలిసి వెండితెరపై కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, పుష్ప 2: ది రూల్ ఘనవిజయం తర్వాత ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో త‌న 26వ‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ కనగరాజ్‌తో మరో ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.