Latest News
టీ20 వరల్డ్ కప్ 2026: టీమిండియా బ్యాట్లలో రబ్బర్ ఉందా? రాజపక్స సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం ఇదే!
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఐర్లాండ్పై శ్రీలంక విజయం సాధించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 8న జరిగింది.
25 ఏళ్ల సినీ ప్రస్థానం.. శ్రియా శరన్ మనసులో ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందట!
నటి శ్రియా శరన్ ఇప్పటికీ తన అందం, నటన, గౌరవప్రదమైన ప్రయాణంతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న అగ్రనాయికలలో ఒకరిగా నిలుస్తున్నారు. 25 ఏళ్లకు పైగా సినీ ప్రయాణం పూర్తి చేసి, మధ్య నలభైల్లో ఉన్నప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గడంలేదు.
గూగుల్ పిక్సల్ 10పై భారీ ఆఫర్: ఏకంగా రూ.13వేలకు పైగా తగ్గింపు.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పిక్సల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెనకడుగు వేసిన వారికి శుభవార్త. పిక్సల్ 10 ఇప్పుడు భారీ డిస్కౌంట్తో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. భారత్లో ప్రారంభ ధర రూ.79,999గా ఉన్న ఈ ఫోన్పై ప్రస్తుతం రూ.13,000కు పైగా తగ్గింపు లభిస్తోంది.
వాంఖడే పిచ్పై బీసీసీఐకి టీమిండియా ఫిర్యాదు..? అమెరికాతో మ్యాచ్ తర్వాత అసంతృప్తి..?
టీ20 వరల్డ్కప్ 2026లో ఈసారి అమెరికాతో తలపడ్డ భారత్ అతికష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల వరకు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని, భారత్ 300 స్కోరు సాధించడం ఖాయమని అందరూ అంచనా వేశారు.
విజయ్ పార్టీ ఎఫెక్ట్: చెపాక్ స్టేడియంలో ఈలలపై నిషేధం.. పొలిటికల్ సెగ!
చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో ఈ నిర్ణయం అమలవుతోంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు స్టేడియంలోకి విజిల్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు.
పసుపు పాలు తాగుతున్నారా? డాక్టర్ పాల్ మాణికం సీరియస్ హెచ్చరిక!
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా ఇన్స్టాగ్రామ్ స్కిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఆయన పసుపు పానీయాల ప్రయోజనాలను విశ్లేషిస్తూ, పసుపు సప్లిమెంట్లపై మాత్రం స్పష్టమైన హెచ్చరిక చేశారు.
తెలంగాణకు అన్యాయం చేస్తే సహించం.. బీజేపీ, బీఆర్ఎస్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలకు ప్రజలు వేసే ఓట్లు వృథా అవుతాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్పై క్రేజీ అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం.
డీఆర్డీఓలో అప్రెంటిస్ కొలువులు.. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా వారికి ఛాన్స్!
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
















