వార్తలు
మేమంతా క్షేమం.. దుబాయ్లో శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల దుబాయ్లో తాను, తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని అభిమానులకు భరోసా ఇచ్చారు.
మంచు విష్ణు ఫ్యామిలీ కోసం లక్ష్మి ఆందోళన.. దుబాయ్లో ఏం జరుగుతోంది?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో భావోద్వేగ మెసేజ్ను పోస్టు చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు.
అంటార్కిటికాలో మహేష్ బాబు-ప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ మూవీ బిగ్ అప్డేట్!
సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విపరీత వాతావరణ ప్రాంతాల్లో ఒకటైన అంటార్కిటికాకు వెళ్లనుంది.
శనకపై మలింగ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్ వద్ద హైడ్రామా! పాక్తో మ్యాచ్ తర్వాత అసలేం జరిగింది?
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెకెలెలో పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో చివరి ఓవర్లలో శనక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఓ దశలో శనక బాదుడుకు శ్రీలంక గెలుస్తుందని కూడా భావించారు.
గొప్పల కోసం అప్పులు చేయొద్దు.. యువతకు మంచు మనోజ్ హితవు!
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు. ఓ యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్లో పాల్గొన్న ఆయన యువతకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు.
‘అరవడం కాదు.. ప్రశాంతతే ముఖ్యం’.. వరుస ఎదురుదెబ్బలపై దీపికా పదుకొనె ఎమోషనల్ పోస్ట్!
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అన్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు.
‘మృత్యుంజయ్’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. శ్రీ విష్ణు బర్త్ డే స్పెషల్!
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్చి 26, 2026న ప్రారంభం అయి మే 31, 2026 వరకు జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా.. అంటే మార్చి 28, 2026న ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.
విజయ్కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. దేశమంతటా ఈ విషయం చర్చనీయాంశంగా మారగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

















