వైరల్ : కళ్యాణ మండపంగా మారిన కరోన వార్డు.. ఏకంగా కరోనా వార్డులో పెళ్లి చేసుకున్న జంట!

April 27, 2021 2:18 PM

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనా అంటేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. మన చుట్టుపక్కల ఎవరికైనా కరోనా సోకింది అనే వార్త తెలియగానే వారిని ఎంతో చిన్నచూపుతో చూస్తున్న రోజులివి. అలాంటిది తనకు కాబోయే భర్తకు కరోనా సోకిందనే వార్త తెలియగానే ఆ వధువు ఏమాత్రం భయపడకుండా ముందడుగు వేసింది.

కేరళలోని కైనంకరి ప్రాంతానికి చెందిన శరత్, అభిరామికి వివాహం కుదిరింది. ఈ నెల 25న వీరి వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. అయితే వీరి పెళ్లికి కరోనా అడ్డుపడింది. వరుడు అతని తల్లి కరోనా బారిన పడటంతో అలప్పుజా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వదువు అభిరామి మాత్రం అనుకున్న తేదీ తన పెళ్లి జరగాలని నిర్ణయించుకుంది. దీని కోసం రెండు కుటుంబాల సభ్యులను ఒప్పించింది.

ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యులు కలెక్టర్ ను కలిసి జరిగిన విషయం చెప్పి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నారు. కలెక్టర్ అనుమతి ఇవ్వడంతో ఆస్పత్రిలోని కోవిడ్ వార్డు కాస్తా.. కళ్యాణ మంటపంగా మారిపోయింది. ఇరు కుటుంబాలు నిశ్చయించిన తేదీ సమయానికి పీపీఈ కిట్‌లో వచ్చిన అభిరామి, శరత్ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ జంటకు కరోన వార్డులో చికిత్స తీసుకుంటున్న తన అత్తగారు దగ్గరుండి దండలు అందించి వీరి పెళ్లి జరిపించడం విశేషం. ఈ విధంగా కరోనా వార్డులో ఒకటైన ఈ జంటకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment