Rashmi Gautam : రష్మి గౌతమ్‌ నన్ను బెదిరించింది.. ఆమె గుట్టు రట్టు చేసిన ప్రొడ్యూసర్..

March 14, 2022 11:40 AM

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన రష్మి గురించి అందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఆమె తనను బెదిరించిందని తాజాగా ఓ నిర్మాత ఆమె విషయాలను బయటపెట్టారు. దీంతో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.

Rashmi Gautam frightened me says producer
Rashmi Gautam

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలాజీ నాగలింగం అనే ఓ ప్రొడ్యూసర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మి గురించి విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఒక వ్యక్తిని తిట్టాము అంటే వారి వల్ల మనం ఎంత బాధ పడి ఉంటామో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. రష్మి గుంటూరు టాకీస్ సినిమా చేస్తున్న సమయంలో శ్రీ లక్ష్మీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి నేను నా స్నేహితుడు కలిసి రష్మి ప్రధాన పాత్రలో ఒక సినిమా చేయాలని భావించాము.

ఈ విధంగా రష్మితో ఆమె రెమ్యునరేషన్ గురించి అన్ని విషయాలు మాట్లాడి సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇక చివరిలో ఒక సాంగ్, డబ్బింగ్ పార్ట్‌ మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో తాను షూటింగ్ కి రానని, హీరోని మార్చాలంటూ రష్మి డిమాండ్ చేసింది. ఆ సమయంలో తనతో మాట్లాడగా తనకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు.. అంటూ వారి పేర్లు చెబుతూ నన్ను బెదిరించిందని ఆయన తెలియజేశారు.

నేను కూడా ఇండస్ట్రీలోనే ఉన్నవాడిని అని.. నాకు నాగబాబు , శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలియదా.. ఆ రోజు రష్మి నాతో మాట్లాడిన మాటలు అన్నీ నా దగ్గర రికార్డు చేయబడి ఉన్నాయి. అప్పుడు నేను రష్మిని ఫిలిం చాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్న మాట నిజమే. నేను కేవలం నిజం చెప్పాలని మాత్రమే బెదిరించాను. నిజాయితీగా ఉండమని చెప్పాను.. అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా బాలాజీ నాగలింగం రష్మి గురించి వెల్లడించారు. ఇలా చివరిలో పేచీ పెట్టుకున్న రష్మి మూడు నెలలపాటు షూటింగ్‌ కి రాలేదని, ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెనే మళ్లీ వచ్చి షూటింగ్‌ కంప్లీట్‌ చేసిందని.. తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఈయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment