ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోంది. అంతా బాగానే ఉందనుకుంటున్న నేపథ్యంలో కరోనా ఒమిక్రాన్ రూపంలో విలయ తాండవం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ ఇంకా నష్టాల్లోనే ఉన్న అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ కంపెనీకి చెందిన సీఈవో ఒకే ఒక్క కాల్తో ఏకంగా 900 మంది ఉద్యోగులను తమ కంపెనీ నుంచి తీసేశాడు. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న బెటర్ డాట్ కామ్ అనే కంపెనీకి భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ సీఈవోగా పనిచేస్తున్నాడు. అయితే ఇది వరకే కొంత మందిని పెద్ద ఎత్తున ఈయన తీసేశాడు. తాజాగా మరో 900 మందిని తీసేస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే అంత మందితోనూ ఒకే ఒక్క జూమ్ వీడియో కాల్ లో మాట్లాడి.. వాళ్లను తీసేస్తున్నట్లు అప్పటికప్పుడే తెలిపాడు.
కంపెనీ నష్టాల్లో ఉందని, అందువల్ల ప్రదర్శన సరిగ్గా లేని ఉద్యోగులను తీసేయక తప్పడం లేదని, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇలా ఉద్యోగులను తీసేయడం ఇది రెండోసారని, తనకు ఈ విధంగా చేయడం నచ్చడం లేదని, అయినప్పటికీ తీసేయక తప్పడం లేదని తెలిపాడు. నాతో కాల్లో ఉన్న మీ 900 మంది ఉద్యోగులు దురదృష్టవంతులు అని అన్నాడు. ఈ క్రమంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. కొందరు ఆ సీఈవోను విమర్శిస్తున్నారు.
ఉద్యోగులను తీసేయడం కరెక్టే కానీ.. మరీ ఇలా ఉన్నపళంగా తీసేస్తే ఎలా ? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కంపెనీ ఉద్యోగులను తీసేసినప్పటికీ 2 నెలల జీతం, ఇతర బెనిఫిట్స్ను అందిస్తున్నట్లు తెలిపింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…