Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిరంజీవి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనపై మీడియాతోపాటు పలువురు ప్రముఖులు ఎన్ని విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మీడియా అప్పట్లో ఎలా ప్రవర్తించిందో తాజాగా వివరించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత యాత్ర చేశానని తెలిపారు.
బస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. ఆ సమయంలో ఫ్యాన్స్ తోపాటు ప్రజలను ఆయన కలవడం జరిగింది. చాలా మందిని ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం చేశాను. ఒక స్టేషన్ లో స్పీచ్ ముగిశాక నెక్స్ట్ స్టేషన్ కి బస్సులో వెళుతున్నాను. నాలుగు మీడియా ఛానల్స్ నన్ను నిరంతరం ఫాలో అవుతున్నాయి. అది నా మీద ప్రేమతో కాదు.. ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతుందా.. హైలెట్ చేయాలనే తపనతో.
నాకు మా బాయ్ ఖర్జూరాలు తినడానికి ఇచ్చాడు. వాటిని తినడం కోసం శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నాను. అది నీట్ గా వీడియో తీసి.. నేను పండ్లు తినడం కోసం చేతులు శుభ్రం చేసుకున్న వీడియో పక్కన పెట్టి.. ఫ్యాన్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వగానే చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నట్లు చక్కగా ఎడిట్ చేశారు.
చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియో పదే పదే చూపిస్తూ.. చిరంజీవికి ఫ్యాన్స్ అంటే అంత అంటరాన్ని వాళ్ళు అయ్యారా ? ప్రజల్ని తాకడమంటే ఆయనకు అంత అసహ్యమా ? ఇలాంటి వ్యాఖ్యలతో నన్ను బద్నామ్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మైక్ పైన శానిటైజర్ స్ప్రే చేద్దామన్నా.. భయం వేస్తుంది అని చిరు ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…