మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి ఓ తమ్ముడు తన అక్కను అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేశాడు. చిత్రమేమిటంటే.. ఇందుకు వారి తల్లి కూడా ప్రోత్సహించింది. ఆమె, అతను కలిసి ఆ యువతిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న వైజాపూర్ తహసీల్ గోయ్గావ్ అనే గ్రామానికి చెందిన కీర్తి థోరె (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారు ఒప్పుకోలేదు. దీంతో వారు ఇళ్ల నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకుని సొంతంగా జీవిస్తున్నారు.
అయితే కీర్తి థోరె తమ్ముడు (17), తల్లి ఇద్దరూ కలిసి మరాఠీ మూవీ సైరట్ను చూసి ప్రేరణ పొందారు. అందులో హీరోయిన్కు నచ్చజెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఉన్న చోటుకు వెళ్తారు. చివరకు ఆమెను అతి దారుణంగా నరికి చంపుతారు. సినిమాల్లో చివరి సీన్ అదే. దీంతో కీర్తి థోరె తమ్ముడు, తల్లి కూడా ఆ సీన్ను ప్రేరణగా తీసుకున్నారు. కీర్తిని చంపాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కీర్తి ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పారు. ఆమె పెళ్లిని తాము ఆమోదిస్తున్నామని, గతంలో జరిగినవన్నీ మరిచిపోయి అందరం సంతోషంగా ఉందామని నమ్మబలికారు. దీంతో ఆమె నిజమేనని నమ్మింది. తరువాత టీ పెట్టి తెస్తానని చెప్పి ఇంట్లో కిచెన్లోకి వెళ్లింది. అయితే ఆమె తమ్ముడు ఇంటి డోర్ పెట్టి కిచెన్లో ఆమె వెనుకగా వెళ్లాడు.
ఈ క్రమంలోనే కీర్తి కాళ్లను పట్టుకున్న ఆమె తల్లి ఆమెను వెనక్కి లాగి కింద పడేసింది. ఆపై కీర్తిని అదిమిపట్టుకుంది. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో తమ్ముడు ఆమె తలను నరికి వేరు చేశాడు. అనంతరం ఆమె తలతో ఇద్దరూ సెల్ఫీలు సైతం దిగారు. చుట్టు పక్కల ఉన్నవారికి ఆ తలను చూపించారు. అయితే అదే సమయానికి కీర్తి భర్త వచ్చాడు. కీర్తి తమ్ముడు అతన్ని కూడా చంపబోయాడు. కానీ అతను తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా వారు సైరట్ సినిమాను చూసి ప్రేరణ పొంది ఆ హత్య చేసినట్లు తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…