క్రైమ్‌

సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సంగారెడ్డి జిల్లా కోర్టు.. ఐదేళ్ల బాలిక హ‌త్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష‌..

ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్ర‌జ‌ల‌లో మార్పు రావ‌డం లేదు. చిన్న చిన్న పిల్ల‌లపై కూడా హ‌త్యాచారాలు చేస్తూ సభ్య‌స‌మాజం సిగ్గుప‌డేలా చేస్తున్నారు. తాజాగా ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లాలోని పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న 56 సంవత్సరాల బీహార్ వలస కార్మికుడికి ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు గురువారం తీర్పుని వెలువరించింది. చిన్నారి తల్లితండ్రులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన 11 నెలలలోపే తీర్పు వచ్చింది. సంగారెడ్డి కోర్టు పరిధిలో ఉరిశిక్ష విధించడం 27 సంవత్సరాల తర్వాత… ఇదే మొదటిసారి.

బీహార్ రాష్ట్రానికి చెందిన గఫార్ అలీ(56) గత సంవత్సరం బీడీఎల్ బానూరులో ఐదేళ్ల బాలికకు కూల్ డ్రింక్స్‌లో మద్యం కలిపి తాగించి.. అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే అనుమానంతో హత్య చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.నిందితుడిపై నేరాభియోగానికి సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించడంతో గఫార్‌కు మరణ దండన విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, ఈ ఘటన జరిగి 11 నెలలు అవుతోంది. తక్కువ సమయంలోనే దోషికి ఉరిశిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించారు.

కేసు వివ‌రాల‌లోకి వెళితే..బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చైతన్య కంపెనీ లో పనిచేసే దంపతుల ఐదేళ్ల కుమార్తెను సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి వారు పనికి వెళ్లారు. వీరి రూమ్ ప్రక్క రూంలో ఉండే నేరస్తుడు గఫాఫర్ అలీ అక్టోబర్ 16, 2023 నాడు పనికి వెళ్ళకుండా మద్యం సేవించి ఉన్నాడు. సుమారు ఉదయం 11 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ వద్ద పాప కనిపించగా పాప తెలుసని చెప్పి తీసుకెళ్లాడు.చిన్నారికి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. బాలిక కోసం సాయంత్రం అంతటా వెతికిన తల్లితండ్రులు… చివరికి చిన్నారి శవాన్ని పత్తి చేనులో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో జడ్జి జయంతి… నిందితునికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM