క్రైమ్‌

Venu Swamy : వేణు స్వామికి భారీ షాకే త‌గిలిందిగా.. ఏమైందంటే..?

Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి ప‌లువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంటారు. అటు.. సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖలకు సంబంధించిన జాతకాలను చెప్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అయితే.. వాటి గురించి ఎవరూ అడగకపోయినా.. తనకు తానుగా చెప్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు మన వేణు స్వామి.గతంలో.. సమంత- నాగచైతన్య వివాహ జీవితంపై సంచలన ఆరోపణలు చేసి.. ఒక్కసారిగా ఫేమస్ అయిన వేణుస్వామి..ఇటీవ‌ల‌నాగచైతన్య- శోభితా దూలిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వారి వైవాహిక జీవితం గురించి కీలక ఆరోపణలు చేసి.. అంతకు మించి వివాదాల్లో ఇరుక్కున్నారు.

సమంత, నాగ చైతన్య విడిపోయినట్టుగానే.. శోభిత దూలిపాళ్ల, నాగచైతన్య కూడా కొద్ది రోజులకే విడిపోతారంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే.. వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్‌‌ను సినీ ఇండస్ట్రీలోని పలువురు సీరియస్‌గా తీసుకుని.. ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల పర్సనల్ జీవితంపై ఇలా నిరాధారంగా ఆరోపణలు చేస్తుండటం, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించమేనని అభిప్రాయపడ్డారు. ఇక.. వేణుస్వామి తీరుపై సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్.. ఏకంగా మహిళా కమిషన్ ఛైర్మన్‌కు ఫిర్యాదు కూడా చేయటం గమనార్హం.ఈ క్రమంలోనే.. జర్నలిస్టు మూర్తిపై వేణుస్వామి, ఆయన సతీమణి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. తమను జర్నలిస్టు మూర్తి.. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని.. ఇవ్వకపోయేసరికి తనను టార్గెట్ చేశాడంటూ ఘాటు ఆరోపణలు చేశారు. తమకు మూర్తి నుంచి ప్రాణ హాని ఉందని.. కూడా ఆరోపించారు. దీంతో.. ఆ ఆరోపణలపై స్పందించిన మూర్తి.. పోలీసులుక ఫిర్యాదు చేయటంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు.

Venu Swamy

జాతకాల పేరుతో ప్రజలను వేణు స్వామి మోసం చేస్తున్నారని… ప్రధాని మోదీ ఫొటోను కూడా మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టులో ప్రముఖ పాత్రికేయుడు ‘టీవీ5’ మూర్తి పిటిషన్ వేశారు. వేణు స్వామి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చిన తనపై కుట్ర పన్నారని పిటిషన్ లో మూర్తి పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన కోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వేణు స్వామిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM