కొందరు సాధారణ సమస్యలతో హాస్పిటల్లో చేరుతుంటారు. కానీ వారికి కొన్ని సందర్భాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు పరీక్షల్లో తేలుతుంది. దీంతో జరగరాని నష్టం జరుగుతుంది. ఓ మహిళకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్లో చేరింది. కానీ దురదృష్టవశాత్తూ రెండు కాళ్లనూ, ఒక చేయిని కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
హంగేరీలోని పెక్స్ అనే ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల మోనికా ఈ ఏడాది జనవరిలో కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరింది. అయితే జీర్ణాశయానికి రంధ్రాలు పడ్డాయని సర్జరీ చేస్తే చాలని వైద్యులు చెప్పారు. కానీ తరువాతే షాకింగ్ విషయం తెలిసింది. ఓ అరుదైన వ్యాధి కారణంగా ఆమె కాళ్లలో రక్త నాళాలు బ్లాక్ అయ్యాయని, అందుకనే ఆమెకు జీర్ణాశయంలో నొప్పి ఏర్పడిందని వైద్యులు గుర్తించారు.
అయితే కాళ్లలో ఉన్న రక్త నాళాల బ్లాక్లు పైకి వస్తే ప్రమాదమని, అందువల్ల కాళ్లను తీసేయాలని వైద్యులు చెప్పారు. దీంతో మోనికా షాక్ కు గురైంది. అయినా తప్పదు కనుక అంగీకరించింది. దీంతో ఆమెకు మార్చి 1వ తేదీన ఎడమ కాలును తీసేశారు. మార్చి 8న కుడికాలును తీసేయగా, ఎడమ చేయికి కూడా బ్లాక్స్ వచ్చాయని చెప్పి మార్చి 12న ఎడమ చేయిని తొలగించారు.
అయితే ఆయా భాగాలను తొలగించినా ఆమె సమస్య తగ్గలేదు. కేవలం 3 నెలల్లోనే ఆమెకు 16 సార్లు ఆపరేషన్లు చేశారు. అయినప్పటికీ ఆమెకు ఉన్న అనారోగ్య సమస్యను వైద్యులు తగ్గించలేకపోతున్నారు. వైద్య శాస్త్ర చరిత్రలోనే ఇది ఓ అత్యంత అరుదైన కేస్ అని, దీని వెనుక జన్యు సంబంధ కారణాలు ఉండి ఉంటాయని, ప్రస్తుతం ఈ సమస్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు మోనికా పడుతున్న బాధ మాత్రం వర్ణనాతీతంగా మారింది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…