ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీపికా పదుకొనె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ముంబై నగరానికి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) డేటాను పంచుకున్నారు. ఆమె షేర్ చేసిన చిత్రంలో ముంబైలో సగటు AQI సుమారు 150గా ఉన్నట్లు కనిపించింది. ఆ చిత్రంపై ఆమె కామెంట్ కూడా పెట్టారు. ఈ నగరం, ఇక్కడి పిల్లలు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎలా సరిగ్గా ఉంటుంది, సహాయం చేయండి.. అని క్యాప్షన్ పెట్టారు. కాగా గతేడాది నుంచి ముంబైలో వాయు నాణ్యత స్పష్టంగా క్షీణిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ నుంచి వెరీ పూర్ స్థాయిలకు చేరుకుంది. అందులో భాగంగానే దీపికా పదుకొనె స్పందించారు.
2026 ఫిబ్రవరిలో నగరవ్యాప్తంగా AQI స్థాయిలు సుమారు 230 నుంచి 250 మధ్య నమోదయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), ఘట్కోపర్, ములుంద్ వంటి ప్రాంతాల్లో AQI స్థాయి దాదాపు 290 వరకు నమోదై సివియర్ కేటగిరీకి చేరువైంది. ముంబైలో AQI క్షీణించడానికి ప్రధాన కారణాలలో ఒకటి భారీ స్థాయిలో జరుగుతున్న పునర్నిర్మాణ, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల వల్ల ఉత్పత్తి అయ్యే దుమ్ము అని తేలింది. తవ్వకాలు, కూల్చివేత పనులు, నిర్మాణ వ్యర్థాల రవాణా, అలాగే కప్పకుండా ఉంచిన నిర్మాణ సామగ్రి కారణంగా గాల్లో PM10, PM2.5 కణాల పరిమాణం గణనీయంగా పెరుగుతోందని స్పష్టమైంది. ఇవే ముంబైలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
అధికారులు కూడా.. నియమాలను పాటించకుండా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలు కాలుష్యానికి ముఖ్య కారణమని అంగీకరించారు. దీనికి ప్రతిస్పందనగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) దుమ్ము నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణ ప్రాజెక్టులకు వందల సంఖ్యలో షోకాజ్ నోటీసులు, పనులు నిలిపివేయాలనే ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యంపై చర్యల్లో భాగంగా ముంబైలో 1వేయికి పైగా నిర్మాణ ప్రాజెక్టులకు స్టాప్-వర్క్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యపై న్యాయస్థానాలు, నియంత్రణ సంస్థలు కూడా జోక్యం చేసుకున్నాయి. వాయు కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యారని బాంబే హైకోర్టు పౌర అధికారులను విమర్శించింది. వాయు నాణ్యతకు సంబంధించిన ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది.
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…