ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీపికా పదుకొనె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ముంబై నగరానికి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) డేటాను పంచుకున్నారు. ఆమె షేర్ చేసిన చిత్రంలో ముంబైలో సగటు AQI సుమారు 150గా ఉన్నట్లు కనిపించింది. ఆ చిత్రంపై ఆమె కామెంట్ కూడా పెట్టారు. ఈ నగరం, ఇక్కడి పిల్లలు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎలా సరిగ్గా ఉంటుంది, సహాయం చేయండి.. అని క్యాప్షన్ పెట్టారు. కాగా గతేడాది నుంచి ముంబైలో వాయు నాణ్యత స్పష్టంగా క్షీణిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ నుంచి వెరీ పూర్ స్థాయిలకు చేరుకుంది. అందులో భాగంగానే దీపికా పదుకొనె స్పందించారు.
2026 ఫిబ్రవరిలో నగరవ్యాప్తంగా AQI స్థాయిలు సుమారు 230 నుంచి 250 మధ్య నమోదయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), ఘట్కోపర్, ములుంద్ వంటి ప్రాంతాల్లో AQI స్థాయి దాదాపు 290 వరకు నమోదై సివియర్ కేటగిరీకి చేరువైంది. ముంబైలో AQI క్షీణించడానికి ప్రధాన కారణాలలో ఒకటి భారీ స్థాయిలో జరుగుతున్న పునర్నిర్మాణ, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల వల్ల ఉత్పత్తి అయ్యే దుమ్ము అని తేలింది. తవ్వకాలు, కూల్చివేత పనులు, నిర్మాణ వ్యర్థాల రవాణా, అలాగే కప్పకుండా ఉంచిన నిర్మాణ సామగ్రి కారణంగా గాల్లో PM10, PM2.5 కణాల పరిమాణం గణనీయంగా పెరుగుతోందని స్పష్టమైంది. ఇవే ముంబైలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
అధికారులు కూడా.. నియమాలను పాటించకుండా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలు కాలుష్యానికి ముఖ్య కారణమని అంగీకరించారు. దీనికి ప్రతిస్పందనగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) దుమ్ము నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణ ప్రాజెక్టులకు వందల సంఖ్యలో షోకాజ్ నోటీసులు, పనులు నిలిపివేయాలనే ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యంపై చర్యల్లో భాగంగా ముంబైలో 1వేయికి పైగా నిర్మాణ ప్రాజెక్టులకు స్టాప్-వర్క్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యపై న్యాయస్థానాలు, నియంత్రణ సంస్థలు కూడా జోక్యం చేసుకున్నాయి. వాయు కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యారని బాంబే హైకోర్టు పౌర అధికారులను విమర్శించింది. వాయు నాణ్యతకు సంబంధించిన ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…