Telangana : సంతానం అనేది దంపతులకు దేవుడు ఇచ్చే వరం. అయితే దురదృష్టవశాత్తూ అది కొందరికి ఉండదు. దీంతో వారు సంతానం లేదని దిగులు చెందుతుంటారు. కానీ సంతానం కలిగితే మాత్రం వారు తమ బిడ్డలను అపురూపంగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి సంతానానికి ఏమైనా అయితే వారు భరించలేరు. ప్రస్తుతం ఓ జంట కూడా ఇలాంటి దుస్థితిలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని చేవెళ్ల ప్రాంతానికి చెందిన రజకనగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాస్, మంజుల దంపతులకు పిల్లలు లేరు. 14 ఏళ్లకు వారికి ఒక పాప జన్మించింది. ఆమెకు సహస్ర అని పేరు పెట్టుకున్నారు. పెళ్లయిన చాలా ఏళ్లకు పాప జన్మించడంతో ఆమెను అల్లారుముద్దుగా వారు పెంచుకోసాగారు. కానీ పాపం.. ఆ పాపను మృత్యువు డెంగ్యూ రూపంలో కబళించింది.
సహస్రకు సెప్టెంబర్ 26న అనారోగ్య సమస్య వచ్చింది. దీంతో ఆమెను శంకర్ పల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం ఆమెను మియాపూర్లోని ఇంకో ప్రైవేటు హాస్పిట్లో చేర్చారు. అయితే అక్కడ ఐసీయూ లేదని చెప్పి అదే హాస్పిటల్కు చెందిన ఇంకో బ్రాంచ్ కేపీహెచ్బీలో ఉండగా.. ఆ పాపను అక్కడికి తరలించారు. అలా సెప్టెంబర్ 28న ఆమెను ఐసీయూలో చేర్చారు.
అయితే ఆ పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఆ దంపతుల వేదన అంతా ఇంతా కాదు. లేక లేక 14 ఏళ్లకు పాప జన్మించినా.. డెంగ్యూ రూపంలో మృత్యువు ఆమెను వెంట తీసుకుపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని ఆ పాప తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి వారికి నచ్చ జెప్పి పంపించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…