Telangana : సంతానం అనేది దంపతులకు దేవుడు ఇచ్చే వరం. అయితే దురదృష్టవశాత్తూ అది కొందరికి ఉండదు. దీంతో వారు సంతానం లేదని దిగులు చెందుతుంటారు. కానీ సంతానం కలిగితే మాత్రం వారు తమ బిడ్డలను అపురూపంగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి సంతానానికి ఏమైనా అయితే వారు భరించలేరు. ప్రస్తుతం ఓ జంట కూడా ఇలాంటి దుస్థితిలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని చేవెళ్ల ప్రాంతానికి చెందిన రజకనగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాస్, మంజుల దంపతులకు పిల్లలు లేరు. 14 ఏళ్లకు వారికి ఒక పాప జన్మించింది. ఆమెకు సహస్ర అని పేరు పెట్టుకున్నారు. పెళ్లయిన చాలా ఏళ్లకు పాప జన్మించడంతో ఆమెను అల్లారుముద్దుగా వారు పెంచుకోసాగారు. కానీ పాపం.. ఆ పాపను మృత్యువు డెంగ్యూ రూపంలో కబళించింది.
సహస్రకు సెప్టెంబర్ 26న అనారోగ్య సమస్య వచ్చింది. దీంతో ఆమెను శంకర్ పల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం ఆమెను మియాపూర్లోని ఇంకో ప్రైవేటు హాస్పిట్లో చేర్చారు. అయితే అక్కడ ఐసీయూ లేదని చెప్పి అదే హాస్పిటల్కు చెందిన ఇంకో బ్రాంచ్ కేపీహెచ్బీలో ఉండగా.. ఆ పాపను అక్కడికి తరలించారు. అలా సెప్టెంబర్ 28న ఆమెను ఐసీయూలో చేర్చారు.
అయితే ఆ పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఆ దంపతుల వేదన అంతా ఇంతా కాదు. లేక లేక 14 ఏళ్లకు పాప జన్మించినా.. డెంగ్యూ రూపంలో మృత్యువు ఆమెను వెంట తీసుకుపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని ఆ పాప తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి వారికి నచ్చ జెప్పి పంపించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…