Telangana : సంతానం అనేది దంపతులకు దేవుడు ఇచ్చే వరం. అయితే దురదృష్టవశాత్తూ అది కొందరికి ఉండదు. దీంతో వారు సంతానం లేదని దిగులు చెందుతుంటారు. కానీ సంతానం కలిగితే మాత్రం వారు తమ బిడ్డలను అపురూపంగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి సంతానానికి ఏమైనా అయితే వారు భరించలేరు. ప్రస్తుతం ఓ జంట కూడా ఇలాంటి దుస్థితిలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని చేవెళ్ల ప్రాంతానికి చెందిన రజకనగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాస్, మంజుల దంపతులకు పిల్లలు లేరు. 14 ఏళ్లకు వారికి ఒక పాప జన్మించింది. ఆమెకు సహస్ర అని పేరు పెట్టుకున్నారు. పెళ్లయిన చాలా ఏళ్లకు పాప జన్మించడంతో ఆమెను అల్లారుముద్దుగా వారు పెంచుకోసాగారు. కానీ పాపం.. ఆ పాపను మృత్యువు డెంగ్యూ రూపంలో కబళించింది.
సహస్రకు సెప్టెంబర్ 26న అనారోగ్య సమస్య వచ్చింది. దీంతో ఆమెను శంకర్ పల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం ఆమెను మియాపూర్లోని ఇంకో ప్రైవేటు హాస్పిట్లో చేర్చారు. అయితే అక్కడ ఐసీయూ లేదని చెప్పి అదే హాస్పిటల్కు చెందిన ఇంకో బ్రాంచ్ కేపీహెచ్బీలో ఉండగా.. ఆ పాపను అక్కడికి తరలించారు. అలా సెప్టెంబర్ 28న ఆమెను ఐసీయూలో చేర్చారు.
అయితే ఆ పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఆ దంపతుల వేదన అంతా ఇంతా కాదు. లేక లేక 14 ఏళ్లకు పాప జన్మించినా.. డెంగ్యూ రూపంలో మృత్యువు ఆమెను వెంట తీసుకుపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని ఆ పాప తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి వారికి నచ్చ జెప్పి పంపించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…