Telangana : పాపం.. పెళ్లయిన 14 ఏళ్లకు పుట్టిన పాప.. డెంగ్యూ రావడంతో చనిపోయింది..

October 3, 2021 7:57 AM

Telangana : సంతానం అనేది దంపతులకు దేవుడు ఇచ్చే వరం. అయితే దురదృష్టవశాత్తూ అది కొందరికి ఉండదు. దీంతో వారు సంతానం లేదని దిగులు చెందుతుంటారు. కానీ సంతానం కలిగితే మాత్రం వారు తమ బిడ్డలను అపురూపంగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి సంతానానికి ఏమైనా అయితే వారు భరించలేరు. ప్రస్తుతం ఓ జంట కూడా ఇలాంటి దుస్థితిలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే..

Telangana : పాపం.. పెళ్లయిన 14 ఏళ్లకు పుట్టిన పాప.. డెంగ్యూ రావడంతో చనిపోయింది..

తెలంగాణలోని చేవెళ్ల ప్రాంతానికి చెందిన రజకనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌, మంజుల దంపతులకు పిల్లలు లేరు. 14 ఏళ్లకు వారికి ఒక పాప జన్మించింది. ఆమెకు సహస్ర అని పేరు పెట్టుకున్నారు. పెళ్లయిన చాలా ఏళ్లకు పాప జన్మించడంతో ఆమెను అల్లారుముద్దుగా వారు పెంచుకోసాగారు. కానీ పాపం.. ఆ పాపను మృత్యువు డెంగ్యూ రూపంలో కబళించింది.

సహస్రకు సెప్టెంబర్‌ 26న అనారోగ్య సమస్య వచ్చింది. దీంతో ఆమెను శంకర్‌ పల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం ఆమెను మియాపూర్‌లోని ఇంకో ప్రైవేటు హాస్పిట్‌లో చేర్చారు. అయితే అక్కడ ఐసీయూ లేదని చెప్పి అదే హాస్పిటల్‌కు చెందిన ఇంకో బ్రాంచ్‌ కేపీహెచ్‌బీలో ఉండగా.. ఆ పాపను అక్కడికి తరలించారు. అలా సెప్టెంబర్‌ 28న ఆమెను ఐసీయూలో చేర్చారు.

అయితే ఆ పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఆ దంపతుల వేదన అంతా ఇంతా కాదు. లేక లేక 14 ఏళ్లకు పాప జన్మించినా.. డెంగ్యూ రూపంలో మృత్యువు ఆమెను వెంట తీసుకుపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్పిటల్‌ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని ఆ పాప తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి వారికి నచ్చ జెప్పి పంపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now