తెలంగాణ

తెలంగాణకు అన్యాయం చేస్తే సహించం.. బీజేపీ, బీఆర్ఎస్‌లపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

ఢిల్లీ వివక్షపై గళమెత్తిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Photo Credit: Telangana CMO.

తెలంగాణ రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌పై నిప్పులు చెరిగారు. రెండు పార్టీల‌కు ప్ర‌జ‌లు వేసే ఓట్లు వృథా అవుతాయ‌ని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌కే ఓట్లు వేసి గెలిపించాల‌ని ఆయ‌న కోరారు. బీజేపీకి ఓటు వేస్తే ప్ర‌ధాని మోదీ రార‌ని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు రార‌ని, కేవ‌లం కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు మాత్ర‌మే ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శ్ర‌మిస్తార‌ని, క‌నుక కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీతోపాటు బీఆర్ఎస్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌ది నాగుపాముల్లా పెన‌వేసుకున్న బంధం అని, ఆ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టుల‌ను గుజ‌రాత్‌కు మళ్లింపు..

ప్రధాని న‌రేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల‌ను గుజరాత్‌కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ ఎలాంటి ప్రత్యేక ప్రాజెక్టులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే, తిరిగి కేవలం 42 పైసల విలువైన ప్రాజెక్టులే వస్తున్నాయని అధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు కోట్ల రూపాయలు ఇస్తున్నామంటూ ప్రచారం చేస్తుందని, కానీ ఎక్కువ భాగం ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్తోందని విమర్శించారు.

ఓవైసీ పేరునే బీజేపీ నేత‌లు ఎక్కువ‌గా స్మ‌రిస్తారు..

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. బీజేపీ నేతలు తమ దేవుడు రాముడని చెబుతారు. కానీ ప్రతి ఉదయం ఓవైసీకి నమస్కరిస్తారు. రోజంతా రాముడి పేరు కంటే అస‌దుద్దీన్ ఓవైసీ పేరును ఎక్కువగా స్మ‌రిస్తార‌ని అన్నారు. ఓవైసీనే బీజేపీకి జీవనాడిగా మారారని, ఎంఐఎం పేరుతోనే ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఒక రాజకీయ పార్టీగానే ఉందని, మతాన్ని రాజకీయం కోసం వాడుకోవడం బీజేపీ తత్వాన్ని చూపిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాషాయ పార్టీకి ఓటేయాలా వద్దా అన్నది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…

Monday, 9 February 2026, 6:03 PM

డీఆర్‌డీఓలో అప్రెంటిస్ కొలువులు.. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా వారికి ఛాన్స్!

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్య‌వ‌ధి గ‌ల‌ అప్రెంటిస్ శిక్షణ…

Monday, 9 February 2026, 4:56 PM

చిలగడదుంపలతో జీర్ణక్రియ మెరుగు.. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కీలక సూచనలు!

చిల‌గ‌డ‌దుంప‌ల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం స‌మ‌యాల్లో వీటిని ఉడ‌క‌బెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువ‌గా తింటారు. అయితే…

Monday, 9 February 2026, 3:02 PM

టీమ్ ఇండియాకు గంభీర్ స్పెషల్ డిన్నర్.. నమీబియాతో పోరుకు ముందు అదిరిపోయే ప్లాన్!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో భాగంగా భార‌త్ ఇప్ప‌టికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో…

Monday, 9 February 2026, 12:37 PM

సూర్యతో దిల్ రాజు రిస్కీ ప్రాజెక్ట్.. ఫ్లాప్ డైరెక్టర్‌కు మరో ఛాన్స్!

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…

Monday, 9 February 2026, 8:24 AM

సూర్య ఇన్నింగ్స్‌కు సెహ్వాగ్ ఫిదా.. టీమిండియా స్టార్‌పై ప్రశంసల జల్లు!

భారత్-యూఎస్‌ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆడిన మ్యాచ్‌…

Sunday, 8 February 2026, 10:15 PM

రేవంత్ రెడ్డి బీజేపీ ‘ట్రోజన్ హార్స్’.. నిజామాబాద్‌లో కేటీఆర్ నిప్పులు!

నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్…

Sunday, 8 February 2026, 8:02 PM

వీరు బొప్పాయి పండ్లు తినకూడదు.. నిపుణుల హెచ్చరిక!

విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే ప‌పైన్ ఎంజైమ్‌తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…

Sunday, 8 February 2026, 6:55 PM