తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల స్కామ్ ను తాము వెలుగులోకి తెచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దివాలా ప్రక్రియలో ఉన్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కు భారీ ప్రభుత్వ పనులు కట్టబెట్టడం వెనుక ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి సంబంధించిన బెనామీ వ్యవహారం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసీ నది ప్రాజెక్టు, లగచర్ల భూములు, అమృత్ పథకం టెండర్లు, సింగరేణి బొగ్గు టెండర్లు, హెచ్ఐఎల్టీపీ భూ లావాదేవీలు వంటి అనేక అంశాల్లో అక్రమాలు బయటపెట్టామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తమ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ వ్యవహారానికి మరింత బలం చేకూర్చుతూ, జనవరి 23న సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. 2023 నుంచే దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీకి, మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనుమతి లేకుండానే వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. 2023 నుంచి 2025 మధ్య కాలంలో కోడంగల్-నారాయణపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, యంగ్ ఇండియా స్కూళ్లు, అమృత్, జల్ జీవన్ మిషన్, మెదక్, సూర్యాపేట రోడ్డు పనులు, మిషన్ భగీరథ సరఫరాలు, కొడంగల్ వెటర్నరీ కాలేజ్ నిర్మాణం వంటి అనేక కీలక పనులు కేఎల్ఎస్ఆర్కు అప్పగించారని ఆరోపించారు.
దివాలా కంపెనీకి రూ.6 వేల కోట్ల ప్రజాధనం అప్పగించడం కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, ఇది అధికార దుర్వినియోగం.. అని కేటీఆర్ అన్నారు. వెంటనే అన్ని కాంట్రాక్టులను రద్దు చేయాలని, పనులను నిలిపివేయాలని, కంపెనీని బ్లాక్లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎస్ఎఫ్ఐఓ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అవసరమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతుందని, లేదంటే వెంటనే కేంద్ర ఏజెన్సీలు రంగంలోకి దిగాలి.. అని సవాల్ విసిరారు.
కేఎల్ఎస్ఆర్ జీతాలు చెల్లించడానికి కూడా అప్పులపై ఆధారపడుతుంటే, బ్యాంక్ గ్యారంటీలు ఎలా తెచ్చిందని, ప్రభుత్వ కాంట్రాక్టులు ఎలా సాధించిందని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఇతర కంపెనీలతో నిధుల లావాదేవీలపై గతంలో ఐటీ దాడుల్లో ఆధారాలు లభించాయని, ముఖ్యమంత్రి పదవికి ముందే ఆ సంస్థకు చెందిన లగ్జరీ వాహనం వాడిన ఫొటోలు కూడా విడుదల చేశారు. మేం ఊహాగానాలు చేయడం లేదు, ఆధారాలతో మాట్లాడుతున్న బాధ్యతాయుతమైన ప్రతిపక్షం మేం.. అంటూ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు.
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…