దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఇది ఒకే భాగంగా విడుదల కానుందని రాజమౌళి స్పష్టం చేశారు. నవంబర్ 2025లో హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారణాసి టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ వేడుకకు హాజరైన అంతర్జాతీయ మీడియాతో రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలపై ఇటీవల ఎంబార్గో ఎత్తివేయడంతో, చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భంగా కథ రెండు భాగాలుగా అవసరమా? అన్న ప్రశ్నకు స్పందించిన రాజమౌళి, చిత్రాన్ని రెండు భాగాలుగా ఆలోచించినప్పటికీ, చివరికి సింగిల్ ఫిల్మ్ గానే నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఈ చిత్ర నిడివి సుమారు మూడు గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుందని వెల్లడించారు. తన కథన శైలితో ఈ పొడవునా ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుతానన్న ధీమాను రాజమౌళి వ్యక్తం చేశారు. కాగా వారణాసి సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుత కాలానికి చెందిన రుద్రగా, అలాగే శ్రీరాముడిగా. ప్రియాంకా చోప్రా మందాకినిగా నటిస్తుండగా, వీల్చైర్లో కనిపించే బలమైన ప్రతినాయక పాత్ర కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
భారీ స్థాయి నిర్మాణ విలువలతో పౌరాణికత, కాలయానం, యాక్షన్ అడ్వెంచర్ల మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఆరు పాటలు చిత్రానికి మరింత ఆకర్షణను అందించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…