మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆక్రమించింది. కొన్ని నెలల క్రితం వరకు రామ్ చరణ్, అడివి శేష్ తమ సినిమాలు పెద్ది, డెకాయిట్ లతో భారీ పోటీలో ఉన్నప్పటికీ మార్చిలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కానీ తాజాగా పరిస్థితి పూర్తిగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ వేసవిలో బాక్సాఫీస్ మంటలు రేపుతుంది. పవర్ స్టార్ – కల్ట్ కెప్టెన్ కాంబినేషన్తో ఉస్తాద్ గ్రాండ్ రిలీజ్ అంటూ వారు ప్రకటన చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే బుచ్చి బాబు సానా సోషల్ మీడియాలో 30-04-2026 న PEDDI వస్తుంది అంటూ పోస్టు పెట్టారు. దీంతో రామ్ చరణ్ కూడా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ PEDDI ఏప్రిల్ 30, 2026న మీ ముందుకు వస్తుందని తెలిపారు. మొదట మార్చి 27కు నిర్ణయించిన విడుదలను అధికారికంగా ఏప్రిల్కు మార్చేశారు. ఇక అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ ను కూడా మార్చి 19 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. దీంతో మార్చి 26న నాని నటించిన ది ప్యారడైజ్ విడుదల యథావిధిగా జరుగుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక మార్చి నెలలో ప్రధానంగా మిగిలింది ఒక్కటే భారీ పోరు. ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్. రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ తొలి భాగం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దానికి సీక్వెల్పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు యశ్ నటించిన టాక్సిక్ సినిమా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపైనా భారీ హైప్ ఉంది. ఇక మార్చి బాక్సాఫీస్ రంగం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో మరింత హీట్ పెరిగింది. ఏప్రిల్లో మాత్రం టాలీవుడ్ స్టార్ సినిమాలు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉండడంతో రాబోయే నెలలు సినిమా ప్రేమికులకు పండగే అని అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…