ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ (MSME) విభాగంలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 6, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ (bankofbaroda.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని ఫిబ్రవరి 26, 2026 గా నిర్ణయించారు.
MSME రిలేషన్షిప్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులు 14 ఖాళీగా ఉండగా, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 62, సీనియర్ మేనేజర్ పోస్టులు 113 ఖాళీగా ఉన్నాయి. MSME సేల్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 177 ఖాళీగా ఉండగా, క్రెడిట్ అనలిస్ట్ విభాగంలో సీనియర్ మేనేజర్ పోస్టులు 19, మేనేజర్ పోస్టులు 34 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 419 పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ను చేపట్టనున్నారు.
MSME విభాగంలో బ్యాంకింగ్ కెరీర్ను లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ను మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను లేదా నోటిఫికేషన్ను సందర్శించి వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…