Telangana : ప్ర‌జ‌ల‌కు షాకులిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం.. భారీగా పెర‌గ‌నున్న విద్యుత్‌, ఆర్‌టీసీ చార్జీలు..?

November 6, 2021 11:07 AM

Telangana : తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు షాకులిచ్చేందుకు రెడీ అవుతోందా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. త్వ‌ర‌లో విద్యుత్ తోపాటు ఆర్‌టీసీ చార్జీలు కూడా భారీగా పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే చార్జిలు ఎంత మేర పెరుగుతాయోన‌ని ప్ర‌జ‌లు ఇప్ప‌టి నుంచే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Telangana government may increase electricity and rtc charges

విద్యుత్ చార్జిల పెంపు విష‌య‌మై అధికారులు ఇది వ‌ర‌కే ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేశారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ చార్జిల పెంపు విష‌య‌మై నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ రెండు శాఖ‌ల‌కు చెందిన అధికారులు మ‌రోమారు ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం రాష్ట్ర కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నార‌ని, అందులో చార్జిల పెంపున‌కు అనుమ‌తిస్తార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌పై రెండు చార్జిల భారం ప‌డ‌నుంది.

విద్యుత్ శాఖ సిద్ధం చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్ర‌ణ సంస్థ కూడా ఆమోదం తెల‌పాల్సి ఉంటుంది. దీంతో చార్జిల పెంపున‌కు మార్గం సుగ‌మం అవుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి.. దాదాపుగా 7 సంవ‌త్స‌రాలుగా విద్యుత్ చార్జీల‌ను పెంచ‌లేదు. కానీ తీవ్ర న‌ష్టాలు వ‌స్తున్నందున పెంపు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

ఇక మ‌రోవైపు ఆర్‌టీసీ కూడా కోవిడ్ కార‌ణంగా రూ.3వేల కోట్లు న‌ష్ట‌పోయిన‌ట్లు స‌మాచారం. కోవిడ్ వ‌ల్ల ఆర్‌టీసీ చార్జిల‌ను పెంచ‌లేదు. మ‌రోవైపు డీజిల్ ధ‌ర‌లు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో ఏటా ఆర్‌టీసీపై అద‌నంగా రూ.550 కోట్ల భారం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఆర్‌టీసీ చార్జిల పెంపు కూడా అనివార్యమేన‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం కేబినెట్ అనుమ‌తి ల‌భిస్తే వెంట‌నే చార్జిల‌ను పెంచే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసి ఫ‌లితాలు కూడా వ‌చ్చాయి క‌నుక‌, ఇబ్బంది ఉండ‌దు కాబ‌ట్టి.. సీఎం కేసీఆర్ కూడా ఈ చార్జిల పెంపుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రోజు రోజుకీ పెరిగిపోతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు, ఇంధ‌న ధ‌ర‌లు, గ్యాస్ ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఇక విద్యుత్‌, ఆర్‌టీసీ చార్జిల‌ను కూడా పెంచితే ప్ర‌జ‌ల‌కు నెల‌వారీ ఖ‌ర్చులు త‌డిసి మోపెడు కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now