Redmi Phones : రూ.8499 ప్రారంభ ధ‌ర‌తో.. రెడ్‌మీ 10ఎ, రెడ్‌మీ 10 ప‌వ‌ర్ ఫోన్లు విడుద‌ల‌..!

April 21, 2022 12:20 PM

Redmi Phones : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను తాజాగా లాంచ్ చేసింది. రెడ్‌మీ 10ఎ, రెడ్‌మీ 10 ప‌వ‌ర్ పేరిట ఈ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఇక వీటిల్లో అందుబాటులో ఉన్న ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి.

Redmi Phones Redmi 10A and Redmi 10 Power smart phones launched
Redmi Phones

రెడ్‌మీ 10ఎ ఫీచ‌ర్లు..

6.53 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్‌, 3/4జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.. త‌దిత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

రెడ్‌మీ 10 ప‌వ‌ర్ ఫీచ‌ర్లు..

6.71 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 50, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.. త‌దిత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

రెడ్‌మీ 10ఎ స్మార్ట్ ఫోన్ చార్‌కోల్ బ్లాక్‌, సీ బ్లూ, స్లేట్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.8499గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.9,499గా ఉంది. ఇక రెడ్‌మీ 10 ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్ ప‌వ‌ర్ బ్లాక్‌, స్పోర్ట్ ఆరెంజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్ ధ‌ర రూ.14,999గా ఉంది. ఈ రెండు ఫోన్ల‌ను అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌, ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఏప్రిల్ 26వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now