Manchu Vishnu : మంచు విష్ణు సినిమాలు మానేస్తే మంచిది.. నెటిజ‌న్ల దారుణ‌మైన కామెంట్లు..

October 25, 2022 1:50 PM

Manchu Vishnu : టాలీవుడ్ లో మంచు మోహన్ బాబుకి ప్రత్యేక స్థానం ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన నటించిన సినిమాలు, పోషించిన పాత్రలు, నిర్మించిన చిత్రాలు ఆయన స్థాయిని అమాంతం పెంచాయి. ఎన్నో వైవిధ్య పాత్రలను పోషించి టాలీవుడ్ లెజెండ్ అన్నట్లుగా ఉండే మోహన్ బాబు ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన హీరోకి కూడా ఇంత దారుణమైన కలెక్షన్స్ రావు. మంచు ఫ్యామిలీ సినిమా అంటే మాత్రం జనాలు బాబోయ్ అంటున్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఆల్ టైం డిజాస్టర్ మోహన్ బాబు నమోదు చేశాడు.

పోస్టర్ ఖర్చులు, పార్కింగ్ చార్జీలు కూడా రాలేదు. ఇప్పుడు తండ్రి సన్ ఆఫ్ ఇండియాతో క్రియేట్ చేసిన రికార్డ్స్ కొడుకు మంచు విష్ణు జిన్నాతో బ్రేక్ చేస్తున్నాడు. కనీసం రూ. 50 లక్షల షేర్ జిన్నా సినిమాకు రాలేదు. దీపావళికి 4 సినిమాలు విడుదల కాగా జిన్నా అతి తక్కువ వసూళ్లు నమోదు చేసింది. కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ లేదు. జనాలు లేక రెండో రోజే షోస్ రద్దు అయ్యాయి. ఇక యూఎస్ లో కేవలం 100 టికెట్స్ అమ్ముడుపోగా రూ. 1.25 లక్షలు వసూలు చేసింది. జిన్నా సినిమా తక్కువలో తక్కువ రూ. 4 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే పదోవంతు వసూళ్లు కూడా రాలేదు.

Manchu Vishnu should stop making films netizen comments
Manchu Vishnu

మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ నటించారని తెలిస్తే ఆ సినిమా బాగోదని జనాలు ఫిక్సయిపోతున్నారు. మోసగాళ్లు సినిమాతో మంచు విష్ణు భారీగా నష్టపోయాడు. మోసగాళ్లు రిజల్ట్ చూశాక మనోజ్ ప్రకటించిన పాన్ ఇండియా మూవీ అహం బ్రహ్మస్మి నిర్మించే సాహసం ఆ ఫ్యామిలీ చేయడం లేదు. ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టిన మనోజ్ మరో అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు తమ చిత్రాలను కుట్ర పూరితంగా దెబ్బతీస్తున్నారని మోహన్ బాబు, విష్ణు ఆరోపణలు చేస్తున్నారు. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైన ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఎన్నోసార్లు రుజువైంది. ఇకనైనా మంచు ఫ్యామిలీ కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment