IPL 2022 : చెన్నైకి ఇంకొక‌టి.. ముంబైకి సున్నా..!

April 21, 2022 11:44 PM

IPL 2022 : ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జరిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 టోర్నీ 33వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠగా సాగింది. చివ‌రి వ‌ర‌కు ముంబైనే గెలుస్తుంద‌ని అనుకున్నారు. కానీ చివ‌రి బంతికి ధోనీ ఫోర్ కొట్టాడు. దీంతో విజ‌యం చెన్నైని వ‌రించింది. ఫ‌లితంగా ముంబైపై చెన్నై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2022 Chennai won by 3 wickets against Mumbai in 33rd match
IPL 2022

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలోనే ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌ను కోల్పోయి 155 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో 51 ప‌రుగుల‌తో తిల‌క్ వ‌ర్మ ఒక్క‌డే ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక చెన్నై బౌల‌ర్ల‌లో ముకేష్ చౌద‌రి 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. డ్వానె బ్రేవో 2 వికెట్లు తీశాడు. అలాగే మిచెల్ శాన్ట‌నర్‌, మనీష్ తీక్ష‌ణ‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై ఆరంభం నుంచి త‌డ‌బ‌డుతూ వ‌చ్చింది. వికెట్ల‌ను వ‌రుస‌గా కోల్పోతూ వ‌చ్చింది. దీంతో ముంబై గెలుస్తుందని భావించారు. కానీ చివ‌ర్లో వ‌చ్చిన ధోనీ మెరుపులు మెరిపించ‌డంతో జ‌ట్టుకు విజ‌యం ఖాయ‌మైంది. ఈ క్ర‌మంలోనే చెన్నై 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ల‌లో అంబ‌టి రాయుడు 40 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకోగా.. రాబిన్ ఊత‌ప్ప 30 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌నిపించాడు. మిగిలిన ఎవ‌రూ రాణించ‌లేదు. ఇక ముంబై బౌల‌ర్ల‌లో డానియెల్ శామ్స్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. జ‌య‌దేవ్ ఉన‌డ్క‌ట్‌కు 2, మెరెడిత్‌కు 1 వికెట్ ద‌క్కాయి. ఇక ఈ మ్యాచ్‌లో కూడా ఓట‌మితో ముంబై వ‌రుస‌గా 7 ఓట‌ముల పాలు అయిన‌ట్లు అయింది. ఈ సీజ‌న్‌లో ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో ఇంకా ఖాతా తెర‌వ‌నే లేదు. ఇక చెన్నై ప‌రిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఇప్ప‌టికే ఒక మ్యాచ్ లో గెలుపొందిన చెన్నైకి ఇది ఈ సీజ‌న్‌లో రెండో విజ‌యం. కాగా ఈ జట్టు ప్లేయ‌ర్లు ఈ విజ‌యంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. మ‌రి చెన్నై ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment