Toll Plaza : జాతీయ రహదారుల మీదే కాదు, రాష్ట్ర ప్రధాన రహదారుల మీద ప్రయాణించేటప్పుడు సహజంగానే టోల్ ప్లాజాలు వస్తుంటాయి. రోడ్డును నిర్మించే కంపెనీలు కొన్నేళ్ల పాటు టోల్ ప్లాజాలు పెట్టి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే జాతీయ రహదారులపై ఇక మీదట టోల్ ప్లాజాలు ఉండవు. వాటిని తొలగించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వివరాలను వెల్లడించారు.
దేశంలోని జాతీయ రహదారులపై త్వరలో టోల్ ప్లాజాలు ఉండవని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ క్రమంలోనే టోల్ ప్లాజాలను తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు గాను కొత్త పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే 3 నెలల్లోనే ఈ పాలసీ అమలులోకి వస్తుందని, దీంతో టోల్ ప్లాజాలను తొలగించడం సులభతరం అవుతుందని తెలిపారు.
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు బదులుగా జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. గతంలో నగదు తీసుకునేవారు.
ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద నగదు తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చేవి. ట్రాఫిక్ బాగా జామ్ అయ్యేది. కానీ ఫాస్టాగ్ వచ్చాక టోల్ వసూలు సులభతరం అయింది. అయితే టోల్ ఫీజు వసూలును ఇంకా సులభతరం చేసేందుకు జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు.
జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ద్వారా వాహనాల నుంచి ఆటోమేటిగ్గా టోల్ వసూలు చేస్తారు. వాహనం టోల్ ప్లాజా గుండా వెళితే ఆటోమేటిగ్గా టోల్ వసూలు అవుతుంది. ఇక ఇందుకు గాను ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుకోవడం తప్పనిసరి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సిస్టమ్కు చెందిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. అందువల్ల త్వరలోనే టోల్ ప్లాజాల వద్ద సమస్యలకు చెక్ పడనుంది.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…