Toll Plaza : జాతీయ రహదారుల మీదే కాదు, రాష్ట్ర ప్రధాన రహదారుల మీద ప్రయాణించేటప్పుడు సహజంగానే టోల్ ప్లాజాలు వస్తుంటాయి. రోడ్డును నిర్మించే కంపెనీలు కొన్నేళ్ల పాటు టోల్ ప్లాజాలు పెట్టి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే జాతీయ రహదారులపై ఇక మీదట టోల్ ప్లాజాలు ఉండవు. వాటిని తొలగించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వివరాలను వెల్లడించారు.
దేశంలోని జాతీయ రహదారులపై త్వరలో టోల్ ప్లాజాలు ఉండవని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ క్రమంలోనే టోల్ ప్లాజాలను తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు గాను కొత్త పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే 3 నెలల్లోనే ఈ పాలసీ అమలులోకి వస్తుందని, దీంతో టోల్ ప్లాజాలను తొలగించడం సులభతరం అవుతుందని తెలిపారు.
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు బదులుగా జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. గతంలో నగదు తీసుకునేవారు.
ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద నగదు తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చేవి. ట్రాఫిక్ బాగా జామ్ అయ్యేది. కానీ ఫాస్టాగ్ వచ్చాక టోల్ వసూలు సులభతరం అయింది. అయితే టోల్ ఫీజు వసూలును ఇంకా సులభతరం చేసేందుకు జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు.
జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ద్వారా వాహనాల నుంచి ఆటోమేటిగ్గా టోల్ వసూలు చేస్తారు. వాహనం టోల్ ప్లాజా గుండా వెళితే ఆటోమేటిగ్గా టోల్ వసూలు అవుతుంది. ఇక ఇందుకు గాను ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుకోవడం తప్పనిసరి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సిస్టమ్కు చెందిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. అందువల్ల త్వరలోనే టోల్ ప్లాజాల వద్ద సమస్యలకు చెక్ పడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…