హైదరాబాద్ లో విషాదం నెలకొంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోలింగ్ షట్టర్ బలితీసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఒక ద్విచక్ర వాహనం షోరూం లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఒక ద్విచక్ర వాహనం షోరూం లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఆ షో రూమ్ కు రోలింగ్ షట్టర్ ఉంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం యధావిధిగా షట్టర్ తెరిచారు.
ఈ క్రమంలోనే అదే సమయంలో అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి అర్జున్ కొడుకు రాజేష్ ఆ రోలింగ్ షట్టర్ లో ఇరుక్కొని పోయాడు.ఈ విధంగా రోలింగ్ షట్టర్ లో ఇరుక్కున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో హడావిడిగా అక్కడున్న అటువంటివారు రోలింగ్ షట్టర్ దించి అందులోనుంచి బాలుడిని బయటకు తీయడంతో అప్పటికే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన తన కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రాజేష్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు.అయితే ఇదంతా కేవలం షాపు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతుందని పలువురు వ్యక్తం చేశారు.
ఇదివరకే ఇక్కడ వాచ్ మెన్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి కూతురికి కూడా కరెంట్ షాక్ తగిలిందని అయితే తన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడింది అని పలువురు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందోనని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…