పాపం పసివాడు.. షట్టర్ లో నలిగి ప్రాణాలు విడిచి..

August 12, 2021 1:55 PM

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోలింగ్ షట్టర్ బలితీసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఒక ద్విచక్ర వాహనం షోరూం లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోలింగ్ షట్టర్ బలితీసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఒక ద్విచక్ర వాహనం షోరూం లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

 

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఒక ద్విచక్ర వాహనం షోరూం లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఆ షో రూమ్ కు రోలింగ్ షట్టర్ ఉంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం యధావిధిగా షట్టర్ తెరిచారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఒక ద్విచక్ర వాహనం షోరూం లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఆ షో రూమ్ కు రోలింగ్ షట్టర్ ఉంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం యధావిధిగా షట్టర్ తెరిచారు.

ఈ క్రమంలోనే అదే సమయంలో అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి అర్జున్ కొడుకు రాజేష్ ఆ రోలింగ్ షట్టర్ లో ఇరుక్కొని పోయాడు.ఈ విధంగా రోలింగ్ షట్టర్ లో ఇరుక్కున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో హడావిడిగా అక్కడున్న అటువంటివారు రోలింగ్ షట్టర్ దించి అందులోనుంచి బాలుడిని బయటకు తీయడంతో అప్పటికే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ క్రమంలోనే అదే సమయంలో అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి అర్జున్ కొడుకు రాజేష్ ఆ రోలింగ్ షట్టర్ లో ఇరుక్కొని పోయాడు.ఈ విధంగా రోలింగ్ షట్టర్ లో ఇరుక్కున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో హడావిడిగా అక్కడున్న అటువంటివారు రోలింగ్ షట్టర్ దించి అందులోనుంచి బాలుడిని బయటకు తీయడంతో అప్పటికే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్రంగా గాయపడిన తన కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రాజేష్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు.అయితే ఇదంతా కేవలం షాపు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతుందని పలువురు వ్యక్తం చేశారు.

తీవ్రంగా గాయపడిన తన కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రాజేష్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు.అయితే ఇదంతా కేవలం షాపు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతుందని పలువురు వ్యక్తం చేశారు.

ఇదివరకే ఇక్కడ వాచ్ మెన్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి కూతురికి కూడా కరెంట్ షాక్ తగిలిందని అయితే తన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడింది అని పలువురు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందోనని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఇదివరకే ఇక్కడ వాచ్ మెన్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి కూతురికి కూడా కరెంట్ షాక్ తగిలిందని అయితే తన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడింది అని పలువురు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందోనని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment