తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి లో ఫార్మాసిటీ కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఇంటికొక ఉద్యోగం దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఈ ఫార్మాసిటీ కోసం రైతులకు నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తామని తెలిపింది.
ఈ క్రమంలోనే పది ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి శిక్షణ తరగతులను ప్రారంభించారు. రెండు నెలల పాటు శిక్షణ అనంతరం వీరిని విధుల్లోకి తీసుకొనున్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది.ఈ క్రమంలోనే మొదటి బ్యాచ్ కింద 120 మంది యువతను ఎంపిక చేసి వారికి సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే యువత విద్యార్హతల ఆధారంగా ఆయా కోర్సుల్లో టీఎస్ఐఐసీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. క్వాలిటీ కంట్రోలర్, డ్రైవింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రొడక్షన్ ఆపరేటర్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వివిధ పనుల కోసం యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రెండు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం వీటిని విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ శిక్షణ లో భాగంగా వీరికి ఒక పూట భోజనంతో పాటు వెళ్లి రావడానికి ట్రాన్స్ పోర్ట్ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుందని తెలిపారు ఈ శిక్షణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…