క్రికెట్, సినిమా సెలబ్రిటీలు ఒకరినొకరు కలిస్తే నిజంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజే. తమ అభిమాన ప్లేయర్లు, నటులను ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ సంబర పడిపోతుంటారు. ఇక తాజాగా అలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కలిశాడు.
విజయ్ బీస్ట్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండగా ఆయనను ధోనీ కలిశాడు. గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉన్న గోకులం స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ధోనీ కూడా అక్కడే షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు. త్వరలోనే రెండో దశ ఐపీఎల్ 2021 జరగనుంది. దీంతో ఓ యాడ్ చిత్రీకరణ కోసం ధోనీ చెన్నైలో ఉన్నాడు. అందులో భాగంగానే విజయ్ను ధోనీ కలిశాడు.
కాగా వారిద్దరూ కలిసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…