క్రికెట్, సినిమా సెలబ్రిటీలు ఒకరినొకరు కలిస్తే నిజంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజే. తమ అభిమాన ప్లేయర్లు, నటులను ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ సంబర పడిపోతుంటారు. ఇక తాజాగా అలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కలిశాడు.
విజయ్ బీస్ట్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండగా ఆయనను ధోనీ కలిశాడు. గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉన్న గోకులం స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ధోనీ కూడా అక్కడే షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు. త్వరలోనే రెండో దశ ఐపీఎల్ 2021 జరగనుంది. దీంతో ఓ యాడ్ చిత్రీకరణ కోసం ధోనీ చెన్నైలో ఉన్నాడు. అందులో భాగంగానే విజయ్ను ధోనీ కలిశాడు.
కాగా వారిద్దరూ కలిసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…