ఆంధ్ర‌ప్ర‌దేశ్

13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్.. చంద్రబాబు సంచలన ప్రకటన!

అసెంబ్లీలో సోషల్ మీడియా నియంత్రణపై కీలక ప్రకటన చేస్తున్న సీఎం చంద్రబాబు. Photo Credit: RTVLive.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయ‌న.. క‌చ్చితంగా వచ్చే 90 రోజుల్లో 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించలేని విధంగా చర్యలు తీసుకుంటాం.. అని స్పష్టం చేశారు. అలాగే 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఈ నిషేధాన్ని విస్తరించాలా లేదా అన్న విషయంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తిరుమ‌ల ల‌డ్డూ వివాదంతోపాటు ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత జ‌గ‌న్ గురించి కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

తిరుమ‌ల ల‌డ్డూను అప‌విత్రం చేశారు..

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూకి సంబంధించిన నెయ్యి కల్తీ ఆరోపణలపై చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను అపవిత్రం చేశారు. ఇది సాధారణ నేరం కాదు. ఇది పూర్వ ప్రణాళికతో చేసిన కుట్ర.. అని ఆయన అన్నారు. 2024లో జరిగిన ఎన్‌డీఏ శాసనసభ్యుల సమావేశంలో కూడా చంద్రబాబు ఇదే అంశంపై మాట్లాడారు. అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. ఆ ప్రభుత్వ కాలంలో తిరుమల ఆలయ లడ్డూల తయారీలో నాసిరకం పదార్థాలు, జంతు కొవ్వు ఉపయోగించారని ఆయన విమర్శించారు.

ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య పెరిగింది..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డిపై కూడా సీఎం చంద్ర‌బాబు విమర్శలు చేశారు. ఈ వివాదంపై జగన్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని, ఇది ప్రజల మ‌నోభావాలను దెబ్బతీసే విషయం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మతపరమైన సంస్థల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. తిరుమల ఆలయ పవిత్రతపై వివాదం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. సుమారు 70 శాతం వరకు వృద్ధి నమోదైంది.. అని వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్‌లో చోటు దక్కేనా?

భారత మాజీ క్రికెటర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్ 2 తర్వాత…

Friday, 6 March 2026, 10:27 PM

టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో వరల్డ్ రికార్డ్.. ఒకేసారి 6.52 కోట్ల మంది వీక్షణ!

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…

Friday, 6 March 2026, 8:01 PM

మెట్ల మార్గంలో తిరుమలకు జాన్వీ కపూర్.. బర్త్ డే వేళ శ్రీవారి సేవలో ‘దేవర’ బ్యూటీ!

బాలీవుడ్ నటి జాన్వీ క‌పూర్ తన జ‌న్మ‌దినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…

Friday, 6 March 2026, 5:57 PM

భయం నీడలో బతకడం దురదృష్టకరం.. యూఏఈ నుంచి లారా దత్తా ఎమోషనల్ వీడియో!

యుద్ధ వాతావ‌ర‌ణంలో రోజూ భ‌య‌ప‌డుతూ జీవించాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని న‌టి లారాద‌త్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ స‌మ‌స్య…

Friday, 6 March 2026, 11:16 AM

సన్ నెక్స్ట్‌లోకి హర్రర్ థ్రిల్లర్ ‘గ్రానీ’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

స‌స్పెన్స్‌, హార్ర‌ర్, థ్రిల్ల‌ర్ మూవీలు అంటే ఇష్ట‌ప‌డే వారికోసం స‌న్ నెక్ట్స్‌లో మ‌రో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny)…

Thursday, 5 March 2026, 5:49 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ మార్పు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు బంప‌ర్ న్యూస్‌. ఆయ‌న న‌టిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా రిలీజ్ డేట్‌ను…

Thursday, 5 March 2026, 4:49 PM

దుబాయ్‌లో చిక్కుకుపోయారా? నేనున్నాను.. సోనూసూద్ మరో భారీ సాయం!

న‌టుడు సోనూసూద్ మ‌రోమారు దాతృత్వం చాటుకున్నారు. కోవిడ్‌-19 సంక్షోభం స‌మ‌యంలో, పంజాబ్ లో వ‌ర‌ద‌ల‌ప్పుడు ఆయ‌న ఎంతో మందికి స‌హాయం…

Thursday, 5 March 2026, 1:50 PM

‘ప్లాన్ చేస్తే ఏదీ జరగదు’.. కెరీర్ కష్టాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్!

త‌న‌కు క‌మ్‌ఫ‌ర్ట్ జోన్‌లో ఉండ‌డం అల‌వాటు లేద‌ని, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటే వెళ్తాన‌ని, ప్లాన్ చేసిన‌వి జ‌ర‌గ‌డం లేద‌ని,…

Thursday, 5 March 2026, 11:19 AM