దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. బ్యాంకింగ్ రంగంలో మంచి కెరీర్ కోసం చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకుకు చెందిన పలు బ్రాంచిల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. సీఏ, ఎంబీఏ చేసిన వారు కూడా అప్లై చేయవచ్చు. అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 30 ఏళ్ల వరకు ఉండవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు లేదా మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు https://www.centralbankofindia.co.in/en/recruitments అనే అధికారిక సైట్ను సందర్శించవచ్చు. ఇందులో కెరీర్స్ లేదా రిక్రూట్మెంట్ అనే సెక్షన్లోకి వెళ్లాలి. అక్కడ ఉండే క్రెడిట్ ఆఫీసర్ అనే జాబ్ నోటిఫికేషన్ను ఎంచుకోవాలి. దీంతో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. ఆసక్తి, అర్హత ఉన్న వారు అక్కడే ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు గాను ఫిబ్రవరి 20ని చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం…
సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత…
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ…
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు.…
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి…