వృద్ధురాలికి ఫించను ఇచ్చేందుకు 25 కిలోమీట‌ర్లు కొండ‌ల‌పై న‌డిచి వెళ్తున్న పోస్టుమాస్ట‌ర్‌.. హ్యాట్సాఫ్ సర్‌..

August 4, 2021 10:28 PM

కొంద‌రు ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు నిరాస‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అందువ‌ల్లే ప్ర‌భుత్వ అధికారులు అంటే ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ చిన్న‌చూపు ఉంటుంది. కానీ ఆయ‌న మాత్రం అలా కాదు. ఒక వృద్ధురాలికి ఫించ‌ను ఇచ్చేందుకు నెల నెలా ఏకంగా 25 కిలోమీట‌ర్ల పాటు కొండ‌ల‌పై ప్ర‌యాణించి సాహ‌సం చేస్తున్నారు. ఆయ‌నే త‌మిళ‌నాడుకు చెందిన పోస్ట్ మాస్ట‌ర్ ఎస్.క్రీస్తురాజా.

this post master travels 25 kilo meters to give pension to old woman

క్రీస్తురాజా వ‌య‌స్సు 55 ఏళ్లు. త‌మిళ‌నాడులోని పాప‌నాశం అప్ప‌ర్ డ్యామ్ బ్రాంచ్‌కు పోస్టు మాస్ట‌ర్‌. ఆయ‌న ఒక్క‌రే అందులో ఉంటారు. పోస్టాఫీస్ మొత్తాన్ని ఆయ‌నే నిర్వ‌హిస్తారు. అయితే అక్క‌డి క‌ల‌క్క‌డ్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కొండ ప్రాంతంలో 110 ఏళ్ల కుట్టియ‌మ్మాల్ అనే వృద్ధురాలు నివ‌సిస్తోంది. ఆమెకు నెల నెలా రూ.1000 ఫించ‌ను వ‌స్తుంది. దాన్ని అందించేందుకు క్రీస్తురాజా నెల‌కు ఒక‌సారి ఆదివారం రోజు ప‌ర్వ‌తాల్లో 25 కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లి మ‌రీ ఫించ‌ను అందిస్తుంటారు.

ఆదివారం అయితే సెల‌వు క‌నుక ఆయ‌న నెల‌లో ఏదైనా ఒక ఆదివారం రోజు ఉద‌యాన్నే 7 గంట‌ల‌కు ప్ర‌యాణం అవుతారు. సాయంత్రం వ‌ర‌కు ఆమె వ‌ద్ద‌కు చేరుకుంటారు. ఆమెకు ఫించ‌న్ అంద‌జేసి మ‌ళ్లీ వెన‌క్కి వ‌స్తారు. ఇందుకు ఆయ‌న‌కు ఒక రోజు ప‌డుతుంది. ఆయ‌న వ‌య‌స్సు 55 ఏళ్లు అయిన‌ప్ప‌టికీ ఓ వృద్ధురాలికి ఫించ‌ను అంద‌జేయాల‌నే త‌లంపుతో ఆయ‌న ఆ సాహ‌సం చేస్తున్నారు. దీంతో అంద‌రూ ఆయ‌న‌ను మెచ్చుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment