దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. బుధవారం (మార్చి 4, 2026) ఉదయం ఆయన ఇన్స్టాగ్రామ్లో ఓ త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేస్తూ, దాన్ని తన ఇష్టమైన హోలీ క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఈ ఫొటో కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోలో నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా ఇద్దరూ రంగు రంగుల గులాల్తో నిండిపోయి హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నట్లు కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రియాంక ఎంతో అందంగా కనిపిస్తూ నిక్ను చేతితో హత్తుకుని చిరునవ్వుతో కెమెరాకు పోజిచ్చారు.
ఈ ఫొటోను షేర్ చేస్తూ నిక్ జోనాస్ ఓ కామెంట్ కూడా పెట్టారు. నా ఇష్టమైన హోలీ జ్ఞాపకాలలో ఒకటి. అందరికీ హ్యాపీ హోలీ! అని రాశారు. కాగా 2018లో వివాహం చేసుకున్న ఈ జంట క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం రెండు విధాలుగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరి సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ అనేక పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. డీపావళి, క్రిస్మస్, హోలీ వంటి పండుగలను ఈ జంట తరచుగా కలిసి జరుపుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన తాజా చిత్రం ది బ్లఫ్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రంలో ఆమె ఖడ్గ యుద్ధాలు, గన్ ఫైట్లు వంటి తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారు.
ది బ్లఫ్ చిత్రంలో ఆమెతో పాటు కార్ల్ అర్బన్ కూడా నటించారు. చిత్రానికి ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించగా, ఆంథోనీ రుసో, జో రుసో, ఏంజెలా రుసో-ఒట్సోట్ లు తమ ఏజీబీవో బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో విడుదలై ప్రియాంక చోప్రా పవర్ఫుల్ నటనతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్…
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల వాయిదా…
రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం నుంచి లీకైన ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా…
ఇంగ్లండ్ లాంటి జట్టును ఓడించాలంటే అందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్…
విద్యార్థులంతా భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సూచించారు.…
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం…