కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల వాయిదా పడింది. ముందుగా మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్లో థియేటర్లలోకి రానుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలే ఈ వాయిదాకు ప్రధాన కారణమని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా మొదట ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న విడుదల కావాల్సి ఉంది. నాలుగేళ్ల విరామం తర్వాత యష్ మళ్లీ వెండితెరపై కనిపించబోతున్న చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బుధవారం (మార్చి 4, 2026) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో నిర్మాతలు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ప్రాజెక్ట్గా వివరించారు.
టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రూపొందించాం. దీన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించాం. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో అనుసంధానం కావాలన్న లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాం. సంవత్సరాలపాటు కష్టపడి రూపొందించిన ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న విడుదల చేయాలని ఉత్సాహంగా ఎదురుచూశాం. అయితే ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలన్న మా లక్ష్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.. అని నిర్మాతలు తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విడుదలను వాయిదా వేయడం సముచితమని నిర్మాతలు భావించినట్లు తెలిపారు. మా భాగస్వాములు, ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విడుదల తేదీని మార్చే కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇది జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయం. మీ అవగాహనకు, సహనానికి ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్దతు కొనసాగుతాయని ఆశిస్తున్నాం.. అని పేర్కొన్నారు.
చిత్రబృందం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లీష్తోపాటు పలు భారతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు గీతు మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ వాయిదా మరో చిత్రానికి లాభం చేకూర్చే అవకాశముంది. రణవీర్ సింగ్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 కూడా మొదట మార్చి 19, 2026న విడుదల కావాల్సి ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఆ తేదీన సోలో విడుదలను పొందే అవకాశం ఉంది. యష్ సినిమా జూన్కు వాయిదా పడటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ తప్పింది. అయితే ధురంధర్ 2ను కూడా ఆ తేదీనే రిలీజ్ చేస్తారా, లేక యుద్ధం కారణాలతో వాయిదా వేస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం నుంచి లీకైన ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా…
ఇంగ్లండ్ లాంటి జట్టును ఓడించాలంటే అందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్…
విద్యార్థులంతా భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సూచించారు.…
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం…
సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత…
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ…