సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విపరీత వాతావరణ ప్రాంతాల్లో ఒకటైన అంటార్కిటికాకు వెళ్లనుంది. మహేష్ బాబు ఇటీవల ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం ది బ్లఫ్ ను సోషల్ మీడియాలో ప్రశంసించగా, దానికి స్పందించిన ఆమె ఒక కీలక సంకేతం ఇచ్చారు. థాంక్ యూ మై ఫ్రెండ్, సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా.. అంటూ రిప్లై ఇవ్వడం ద్వారా, వారి కొత్త చిత్రం వారణాసి షూటింగ్ అంటార్కిటికాలో జరగనుందని పరోక్షంగా ధ్రువీకరించారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అంటార్కిటికా షెడ్యూల్ గురించి గత కొన్ని వారాలుగా వార్తలు వినిపించినప్పటికీ, టీమ్ నుంచి వచ్చిన ఇదే తొలి అనధికారిక ధ్రువీకరణగా భావిస్తున్నారు. వారణాసి చిత్రం పౌరాణికం, చరిత్ర, సైన్స్ ఫిక్షన్ అంశాలను సమ్మిళితం చేస్తూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఇప్పటికే టీమ్ కెన్యాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించింది. తదుపరి షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్లి అనంతరం అంటార్కిటికా షెడ్యూల్ ప్రారంభించనుంది.
ఈ చిత్రాన్ని కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లొకేషన్లు, టైమ్ ట్రావెల్ నేపథ్యం, అంతర్జాతీయ తారాగణం.. ఇవన్నీ కలిసి వారణాసి మూవీని భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం…
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ…
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు.…
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి…
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…