అంటార్కిటికాలో మహేష్ బాబు-ప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ మూవీ బిగ్ అప్‌డేట్!

సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వార‌ణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విపరీత వాతావరణ ప్రాంతాల్లో ఒకటైన అంటార్కిటికాకు వెళ్లనుంది.

March 2, 2026 10:45 AM
Mahesh Babu and Priyanka Chopra to shoot for Varanasi in Antarctica.
‘వారణాసి’ షూటింగ్ కోసం ప్రపంచపు చిట్టచివరి కోనకు వెళ్లనున్న మహేష్ బాబు, ప్రియాంక చోప్రా. Photo Credit: Mahesh Babu/Priyanka Chopra/Instagram.

సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వార‌ణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విపరీత వాతావరణ ప్రాంతాల్లో ఒకటైన అంటార్కిటికాకు వెళ్లనుంది. మహేష్ బాబు ఇటీవల ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం ది బ్ల‌ఫ్ ను సోషల్ మీడియాలో ప్రశంసించగా, దానికి స్పందించిన ఆమె ఒక కీలక సంకేతం ఇచ్చారు. థాంక్ యూ మై ఫ్రెండ్‌, సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా.. అంటూ రిప్లై ఇవ్వడం ద్వారా, వారి కొత్త చిత్రం వారణాసి షూటింగ్ అంటార్కిటికాలో జరగనుందని పరోక్షంగా ధ్రువీకరించారు.

రూ.800 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో..

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజ‌మౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అంటార్కిటికా షెడ్యూల్ గురించి గత కొన్ని వారాలుగా వార్తలు వినిపించినప్పటికీ, టీమ్ నుంచి వచ్చిన ఇదే తొలి అన‌ధికారిక ధ్రువీకరణగా భావిస్తున్నారు. వారణాసి చిత్రం పౌరాణికం, చరిత్ర, సైన్స్ ఫిక్షన్ అంశాలను సమ్మిళితం చేస్తూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఇప్పటికే టీమ్ కెన్యాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించింది. తదుపరి షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్లి అనంతరం అంటార్కిటికా షెడ్యూల్ ప్రారంభించనుంది.

ఈ చిత్రాన్ని కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లొకేషన్లు, టైమ్ ట్రావెల్ నేపథ్యం, అంతర్జాతీయ తారాగణం.. ఇవన్నీ కలిసి వారణాసి మూవీని భారతీయ‌ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment