మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో భావోద్వేగ మెసేజ్ను పోస్టు చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు. ఈ క్లిష్ట సమయాల్లో దుబాయ్లో ఉన్న విష్ణు, ఆయన అందమైన కుటుంబం సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనవాళ్ల విషయంలో అయితే మనసుకు మరింత బాధగా అనిపిస్తుంది. మీ అందరినీ నా హృదయంలో దగ్గరగా ఉంచుకున్నాను. దేవుని కృప మీ చుట్టూ ఉండాలి. ప్రేమ మాత్రమే గెలవాలి.. అని మంచు లక్ష్మి పోస్టు పెట్టారు.
ఇటీవల మంచు విష్ణు దుబాయ్ నుంచి ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో రాత్రి ఆకాశంలో క్షిపణులు కనిపించాయి. ఇంటి మీదుగా వినిపించిన భారీ ఇంటర్సెప్షన్ శబ్దాలు తన కుమార్తె ఆయ్రాను భయపెట్టాయని తెలిపారు. ఈ రాత్రి దుబాయ్లో కుటుంబాన్ని సందర్శిస్తున్నాను. ఆకాశంలో క్షిపణులు కనిపిస్తున్నాయి. పెద్ద శబ్దాలు మా ఇంటిని కంపించాయి, చిన్న ఆయ్రా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. ఎక్కడా ఏ చిన్నారి యుద్ధ శబ్దాల మధ్య పెరగకూడదు.. అని విష్ణు పోస్టు పెట్టారు. అలాగే యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. పౌరులను సురక్షితంగా ఉంచుతున్న యూఏఈ రక్షణ బలగాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత సున్నితమో గుర్తుచేస్తాయి. శక్తి, శాంతి కోసం ప్రార్థనలు. హర్ హర్ మహాదేవ్.. అని పేర్కొన్నారు.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై పలువురు సినీ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ అజిత్ కుమార్ కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నారు. ఆయన చెన్నైకి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణం సాధ్యపడలేదని ఆయన మేనేజర్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు, ప్రముఖులు తమ భద్రతపై అప్రమత్తంగా ఉన్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…
సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత…
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ…
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు.…
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి…
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…